logo

సమకాలీన అంశాలపై అవగాహన అవసరం: అఖిల్‌ అక్కినేని

పాఠశాల స్థాయి నుంచే ప్రపంచ సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సినీనటుడు అఖిల్‌ అక్కినేని అన్నారు.

Published : 24 Sep 2022 03:13 IST


జ్యోతి వెలిగిస్తున్న అఖిల్‌ అక్కినేని. చిత్రంలో ప్రిన్సిపల్‌ ఇఫత్‌ ఇబ్రహీం, సంచిత తదితరులు

మాదాపూర్, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయి నుంచే ప్రపంచ సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సినీనటుడు అఖిల్‌ అక్కినేని అన్నారు. శుక్రవారం కొండాపూర్‌ చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన నమూనా ఐక్యరాజ్యసమితి సమావేశాలకు అఖిల్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఇఫత్‌ ఇబ్రహీం.. మాట్లాడుతూ ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలు, సవాళ్లపై విద్యార్థులు ఐక్యరాజ్యసమితి నమూనా సమావేశాల్లో చర్చించనున్నారని చెప్పారు. చర్చలో ఎదుటి వారు చెప్పేది ఓపికగా విన్నప్పుడే మనం మన వాదనను సమర్థవంతంగా వినిపించగలమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని