logo

కోదండరామస్వామి ఆలయ భూముల లీజు రద్దు చేయాలి

శంషాబాద్‌ సాతంరాయి కోదండరామస్వామి ఆలయ భూముల లీజు రద్దు చేయాలని శివసేన తెలంగాణ శాఖ డిమాండ్‌ చేసింది. ఆలయ భూముల లీజు రద్దు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం...

Published : 24 Sep 2022 03:04 IST

గోల్నాక, న్యూస్‌టుడే: శంషాబాద్‌ సాతంరాయి కోదండరామస్వామి ఆలయ భూముల లీజు రద్దు చేయాలని శివసేన తెలంగాణ శాఖ డిమాండ్‌ చేసింది. ఆలయ భూముల లీజు రద్దు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం చాదర్‌ఘాట్‌ చౌరస్తాలో చేపట్టిన ఆందోళనలో శివసేన తెలంగాణ, ఏపీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ మాట్లాడారు. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల ఆలయ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని కోరారు. శివసేన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌, మహేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని