logo

వాహనం ఢీకొని తల్లి మృతి.. తండ్రికి గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లి మృతి చెందగా, తండ్రి గాయాలపాలయ్యాడు. మూడేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడింది. పటాన్‌చెరు ఠాణా ఎస్సై ప్రసాదరావు తెలిపిన ప్రకారం..

Published : 24 Sep 2022 03:04 IST

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లి మృతి చెందగా, తండ్రి గాయాలపాలయ్యాడు. మూడేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడింది. పటాన్‌చెరు ఠాణా ఎస్సై ప్రసాదరావు తెలిపిన ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం బురుగుపల్లికి చెందిన వడ్డేరాజు తన కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి పటాన్‌చెరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామశివారు హనుమాన్‌ విగ్రహం వద్ద గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీనితో తల్లి వాణి(28) అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రాజు తీవ్రంగా గాయపడగా, మూడేళ్ల శివాలి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడింది. ఈ స్థితిలో ఏం జరిగిందో తెలియని చిన్నారి రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారికి కంటతడి పెట్టించింది. తండ్రి వెంబడే సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చిన్నారిని కూడా తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని