logo

ప్రాణదాతకు ప్రశంస

క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్‌ డి.నవీనను.....

Published : 24 Sep 2022 03:33 IST


కానిస్టేబుల్‌ డి.నవీనను సన్మానించి, రివార్డు అందజేస్తున్న సీవీ ఆనంద్‌

బేగంపేట, న్యూస్‌టుడే: క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్‌ డి.నవీనను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రశంసించారు. గురువారం జింఖానాలో జరిగిన తొక్కిసలాటలో పద్మ అనే మహిళ కిందపడటంతో  కొందరు తొక్కుకుంటూ వెళ్లారు. అపాస్మరక స్థితికి చేరిన బాధితురాలికి బేగంపేట కానిస్టేబుల్‌ నవీన సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఆమెను నగర పోలీసు కమిషనర్‌ శాలువా, ప్రశంసా పత్రంతో సన్మానించడంతోపాటు రూ.5వేల నగదు రివార్డు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు