కొత్త పేర్ల నమోదులో.. ఎడతెగని జాప్యం
రేషన్కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 2 లక్షల మంది పేర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుడు వివరాల సవరణ తదితరాలపై దరఖాస్తులు చేసుకోగా..
లక్షలాది మంది దరఖాస్తుదారుల ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: రేషన్కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 2 లక్షల మంది పేర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుడు వివరాల సవరణ తదితరాలపై దరఖాస్తులు చేసుకోగా.. వాటిల్లో 10 శాతం తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 30శాతం దరఖాస్తుల ప్రక్రియ పూర్తవ్వగా.. 60 శాతం నేటికీ పెండింగ్లో ఉన్నాయి. ఇంట్లో కొత్త కోడలు వచ్చినా, పిల్లలు పుట్టినా రేషన్కార్డుల్లో వారి పేర్ల నమోదుకు ప్రయత్నించిన వారికి నిరాశే ఎదురవుతోంది. కొన్నేళ్లుగా దరఖాస్తుల స్వీకరణ తప్ప తదుపరి ప్రక్రియకు పౌరసరఫరాలశాఖ అనుమతి లభించడం లేదు. ఏళ్లపాటు మీసేవా, పౌరసరఫరాలశాఖ కార్యాలయాలు తిరుగుతున్నా పని అవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలకు, ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీ సేవలు పొందే విషయంలో ఆటంకం ఏర్పడుతోందన్నారు. హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 6,36,698. మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 7.8 లక్షల మంది లబ్ధిదారులున్నారు. పాత రేషన్కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడానికి వీలుగా పౌరసరఫరాలశాఖకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,28,205 దరఖాస్తులు అందాయి. అందులో 40,768 కార్డులకు సంబంధించి ప్రక్రియ పూర్తవగా..11,313 దరఖాస్తులను తిరస్కరించింది. మిగిలినవాటిలో 10,788 దరఖాస్తులు పరిశీలన అధికారుల వద్ద, 6,814 ఎమ్మార్వోలు, ఏఎస్వోల వద్ద, డీఎస్వోల వద్ద 57,200 పెండింగ్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 50 వేలు, మేడ్చల్ జిల్లాలో 40 వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. పాప పుట్టిందని ఏడాది క్రితం మీసేవా ద్వారా పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఉచితంగా వచ్చే బియ్యాన్ని నష్టపోయానని మల్కాజిగిరికి చెందిన సత్యం అనే వ్యక్తి వాపోయారు. మరణించిన వ్యక్తుల పేర్లను వెంటనే తొలగిస్తున్న పౌరసరఫరాలశాఖ, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తోందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించడంతో అమ్మా, నాన్నలను కోల్పోయిన చిన్నారులకు రేషన్ అందడం లేదనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!