Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఆటగాళ్లు

ఉప్పల్‌ మైదానంలో ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యేక

Updated : 24 Sep 2022 18:27 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ మైదానంలో ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్‌ పార్క్‌ హయత్‌లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు.

ఉప్పల్‌లో రేపు జరగనున్న మ్యాచ్‌తో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం కావడంతో మూడో టీ20 మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది. మరోవైపు, తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంతో ఓటమి చవిచూసింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో విజయం సాధించింది. అదే జోరును రోహిత్‌ సేన కొనసాగించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటుకున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా ఈ సిరీస్‌ గెలవడం కూడా ఎంతో కీలకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని