logo

1966లోనే కరోనా వైరస్‌

కరోనా వైరస్‌ పరిణామ చరిత్రపై మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ ఆచార్యులు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌ పద్మభూషణ్‌ బలరాం. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌

Published : 25 Sep 2022 07:29 IST

 ఆచార్య బలరాంకు జ్ఞాపిక అందిస్తున్న ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి   

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పరిణామ చరిత్రపై మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ ఆచార్యులు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌ పద్మభూషణ్‌ బలరాం. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) 81వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగిన కార్యక్రమంలో ‘కరోనా వైరస్‌ యుగంలో రసాయన, జీవశాస్త్రాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు. తాను పరిశోధనాత్మకతతో కరోనా వైరస్‌ను కనుగొన్న డాక్టర్‌ డోరతీ హమ్రే గురించి తెలుసుకోగలిగానని ఆచార్య బలరాం అన్నారు. వాస్తవానికి 1966 నాటికే కరోనా వైరస్‌పై ఆయన మొదటి నివేదికను ప్రచురించారని తెలిపారు. ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ బయో ఇంజినీరింగ్‌లో తన పరిశోధనలకుకు  ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌. వెంకటమోహన్‌ ప్రతిష్ఠాత్మమైన అబ్దుల్‌ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్‌ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు, ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంయుక్తంగా ఫెలోషిప్‌ను అందజేస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని