కన్నా.. కలత చెందకు
ఏఎస్రావునగర్కు చెందిన ఓ బాలిక ఇటీవలి వరకు ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివింది. స్కూల్ దూరం అవుతోందని భావించిన తల్లిదండ్రులు బాలికను తమ ఇంటికి సమీపంలోని స్కూల్కు మార్చారు. అయితే పాత స్కూల్లోనే చదువుకుంటానని పట్టుపట్టింది.
ఏఎస్రావునగర్కు చెందిన ఓ బాలిక ఇటీవలి వరకు ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివింది. స్కూల్ దూరం అవుతోందని భావించిన తల్లిదండ్రులు బాలికను తమ ఇంటికి సమీపంలోని స్కూల్కు మార్చారు. అయితే పాత స్కూల్లోనే చదువుకుంటానని పట్టుపట్టింది. తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బాలిక మాట వినలేదు. చివరికి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సాధారణంగా ఒక ప్రాంతం లేదంటే ఒకే ఇంట్లో ఎక్కువ రోజులు నివసించడం వల్ల ఆ ప్రాంతం.. ఆ ఇంటితో ఒక మానసిక బంధం ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఒకే స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకోవడం వల్ల తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్నేహ పూర్వక బంధాన్ని అల్లుకుంటాం. టీనేజర్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఓరిమితో మాట్లాడి పరిస్థితులను వివరించి..పూర్తి అండదండలు అందిస్తే నెమ్మదిగా కోలుకొని సాధారణ పరిస్థితికి వచ్చేస్తారు. అయితే కొందరిలో మాత్రం ఎంతకీ ఈ కలత తీరదని, చివరికి ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయంలో ఒక్కసారిగా వారిపై నిర్ణయాలు రుద్దకుండా.. నెమ్మదిగా సన్నద్ధం చేయాలన్నారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉండాలనేదానిపై క్లినికల్ సైకాలజిస్టు డా.కృష్ణసాహితి కొన్ని సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
* కొత్త నిర్ణయాన్ని వెంటనే ఆకళింపు చేసుకోవడాన్ని మెదడు త్వరగా స్వీకరించదు. ఇందుకు 2-6 నెలల సమయం పడుతుంది. పెద్దలకే కాకుండా పిల్లలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ముందే మానసికంగా సన్నద్ధం చేయడం మంచిది.
* ఆకస్మికంగా ఇళ్లు మారడం...పిల్లలను కొత్త స్కూల్లో చేర్పించడం వంటి నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోవద్దు. ఎందుకు మారాల్సి వస్తోందో రెండు నెలల నుంచే పిల్లలను చెప్పి సన్నద్ధం చేయడం వల్ల నెమ్మదిగా తెలుసుకుంటారు.
* ఇంట్లో పెంచుకున్న జంతువులు ఆకస్మికంగా దూరమైనా...పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరు తీవ్ర కుంగుబాటుకు లోనవుతారు. ఆయా జంతువుల జీవిత కాలం.. స్వభావం గురించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
* తీవ్ర కలతతో ఉన్నప్పుడు తినకపోవడం, నిరంతరం ఏడవటం, నిద్ర పోకపోవడం, ఇతర పిల్లలతో కలవకపోవడం చేస్తుంటారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఆ సమాచారాన్ని పెద్దలతో పంచుకునేందుకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదించాలి.
డా.కృష్ణసాహితి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!