Hyderbad: నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని లేఖలు వచ్చేవి: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. 

Updated : 25 Sep 2022 17:27 IST

హైదరాబాద్‌: డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మూలాలకు వెళ్లి చికిత్స చేస్తేనే అవినీతిని నిర్మూలించగలమని తెలిపారు. సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులే నిర్భయంగా తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించిన ‘యూత్‌ ఫర్‌ యాంటీకరప్షన్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘సీబీఐలో పనిచేసేటప్పుడు ఎర్ర సిరాతో రాసిన లేఖలు వచ్చేవి. నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని లేఖల్లో రాసేవారు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని