కచ్చితంగా సేవాలోపమే..!
ఛార్జీల రద్దు గురించి సమాచారం అడిగితే ఏకంగా టిక్కెట్లు రద్దు చేయడంతో పాటు..ఆ విషయాన్ని చెప్పకుండా ఆర్థిక నష్టం కలిగించిన రెడ్ లెటర్ హాలిడేస్ ప్రయివేటు లిమిటెడ్కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది.
వేర్వేరు కేసుల్లో జరిమానా విధించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్లు
ఈనాడు, హైదరాబాద్: ఛార్జీల రద్దు గురించి సమాచారం అడిగితే ఏకంగా టిక్కెట్లు రద్దు చేయడంతో పాటు..ఆ విషయాన్ని చెప్పకుండా ఆర్థిక నష్టం కలిగించిన రెడ్ లెటర్ హాలిడేస్ ప్రయివేటు లిమిటెడ్కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. విమాన టిక్కెట్ ధర రూ.84,220, పరిహారం రూ.15వేలు, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. సికింద్రాబాద్కు చెందిన అజయ్రెడ్డి కుటుంబంతో కలిసి ముంబయి నుంచి మారిషస్ వెళ్లేందుకు ప్రతివాద సంస్థను ఆశ్రయించి రూ.1,40,000 పంపి టిక్కెట్లు బుక్ చేయమని కోరారు. అనంతరం రద్దు చేసుకుంటే నష్టం, రీఫండ్పై వివరాల కోసం ఆరాతీయగా ప్రతివాద సంస్థ ప్రతినిధులు ఏకంగా టిక్కెట్లనే రద్దు చేశారు. ఈ సమాచారం చెప్పకపోవడంతో అజయ్ మరోసారి టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
* రామక్రిష్ణానగర్, డీడీకాలనీకి చెందిన ప్రతాప్రాజ్ కొనుగోలు చేసిన ల్యాప్టాప్ కొన్నిరోజులకే పాడైనా మరమ్మతులు చేయకుండా, సేవల్లో నిర్లక్ష్యం చేసిన లెనోవో గ్రూప్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 జరిమానా విధించింది. రూ.50,099, 9శాతం రీఫండ్ చేయడంతో పాటు, పరిహారం రూ.10వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.
* మోసపూరిత హామీలతో మభ్యపెట్టినందుకు బేగంపేట్లోని కంట్రీక్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్కు వినియోగదారుల కమిషన్-2 జరిమానా విధించింది. బండ్లగూడ సన్సిటీకి చెందిన బి.శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు విచారించి, సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ సభ్యత్వ రుసుము రూ.2,02,500, 9శాతం వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.20వేలు పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని తీర్పునిచ్చింది.
* పుప్పాలగూడకు చెందిన డి.మూర్తికి బీమా క్లెయిమ్ చెల్లించకుండా ఇబ్బందిపెట్టిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ.1,29,980, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. మహబూబ్నగర్కు చెందిన జయరామారావుకు క్లెయిమ్ డబ్బు రూ.97,790, పరిహారం రూ.10వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు ఇవ్వాలని ఆదేశించింది.
* ఖాతాదారు ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవికి సంబంధించిన ఫిర్యాదులు, సేవలపై నిర్లక్ష్యంగా ఉన్నందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. ముషీరాబాద్కు చెందిన బి.మురళి ఫిర్యాదుపై విచారించిన కమిషన్...రూ.20వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా