logo

విహారానికి వెళ్లి.. విగత జీవిగా మారి

చెన్నైలో చదివే నగర విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిత్రులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బౌద్ధనగర్‌ డివిజన్‌ సంజీవపురానికి చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపతులకు నితిన్‌(21)తోపాటు

Published : 26 Sep 2022 02:50 IST

సముద్ర స్నానానికి వెళ్లి చెన్నైలో నగర విద్యార్థి మృతి

పుట్టినరోజే విషాదం

నితిన్‌

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: చెన్నైలో చదివే నగర విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిత్రులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బౌద్ధనగర్‌ డివిజన్‌ సంజీవపురానికి చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపతులకు నితిన్‌(21)తోపాటు ఒక కుమార్తె. చెన్నై ఐఐటీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి మహాబలిపురానికి వెళ్లి.. ఈత వస్తుందన్న ధైర్యంతో ఏడుగురు అక్కడ సముద్రంలోకి స్నానానికి వెళ్లారు. ఇద్దరు నడుములోతు వరకు ముందుకెళ్లారు. ఆ సమయంలో వచ్చిన అల వీరిని లోపలికి లాగేసుకుంది. మిగతా ఇద్దరిలో ఒకరు కోమాలోకి వెళ్లగా నితిన్‌ శవమై కనిపించాడు. శనివారం స్థానిక పోలీసులు చంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నగరానికి తీసుకొచ్చి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని