ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చాలా మంది పిల్లలకు సెలవులు ఉన్నాయని ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లడం సాధారణమే.
పిల్లలపైనా కన్నేసి ఉంచాలి
న్యూస్టుడే, వికారాబాద్
తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ (పాత చిత్రం)
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చాలా మంది పిల్లలకు సెలవులు ఉన్నాయని ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లడం సాధారణమే. గతంలో జరిగిన దాదాపు అన్ని దొంగతనాలు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోనే జరిగాయన్నది గుర్తుంచుకోవాలి. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పిల్లలు బావులు, చెరువులు, గుంతల్లో ఈతకు దిగుతుంటారు. ఈ విషయంలోనూ పర్యవేక్షణ అవసరమని గుర్తుంచుకోవాలి.
ఇంటికి తాళం వేస్తే..: తాళాలు కనిపించేలా వేస్తే దొంగలకు విజిటింగ్ కార్డు ఇచ్చినట్లే. అలా కనిపించకుండా తలుపునకు తెర వేయాలి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను, నగదు ఇళ్లల్లో ఉంచకుండా చూసుకోవాలి. అలాగే పక్కింటివారికి చెప్పి వెళ్లడం, గదిలో, వరండాలో లైటు (విద్యుత్తు దీపం) వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి. బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజూ చూసి వెళ్లేలా, పగటిపూట లైట్లు ఆర్పి, చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి చిరునామాను పోలీస్ ఠాణాలో చెబితే రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తారు.
సరదా కాకూడదు ప్రాణాంతకం
పిల్లలు స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారు. పొలం దగ్గర చెట్లు ఎక్కి కిందపడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే నీటితో నిండిన చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడ్డ పిల్లల సంఘటనలు జరుగుతుంటాయి. అందుకే పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఎవరితో ఆటలాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలి.
తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం
ప్రధానంగా అంతర్జాలం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరితో కలివిడిగా ఉంటున్నారా, ఒక్కరే ఫోన్తో ఆడుతున్నారా, తోటి పిల్లలతో కలిసి బయటకు వెళ్లాలని చూస్తున్నారా.. వంటి విషయాలను గమనించాలి. - డాక్టర్ సందీప్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, వికారాబాద్
సమాచారం ఇవ్వండి
ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా పోలీస్ఠాణాలో వివరాలు చెప్పాలి. ఠాణాకు వచ్చే అవకాశం లేకుంటే ఇంటి చిరునామాను చరవాణి సంఖ్య 94406 27354కు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్), లేదంటే ఫోన్ చేసి తెలుపాలి. వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా వేసి రాత్రిపూట గస్తీని పెంచుతాం. - శ్రీను, సీఐ, వికారాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM