logo

సాహస మహిళా పోలీసులకు పదోన్నతులు ఇవ్వాలి

భారత్‌-ఆస్ట్రేలియా టి-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులు, వారి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో

Published : 26 Sep 2022 02:40 IST

టికెట్ల తొక్కిసలాట బాధితులతో మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: భారత్‌-ఆస్ట్రేలియా టి-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులు, వారి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించారు. అంతకు ముందు బేగంపేట్‌ మహిళా పోలీసు కానిస్టేబుళ్లు నవీన, విమలను మంత్రి రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా కానిస్టేబుళ్ల సాహసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి, పదోన్నతులు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశానని వెల్లడించారు. వీరితో కలిసి మ్యాచ్‌ చూసేందుకు ప్రత్యేకంగా బాక్స్‌ టికెట్లు తీసుకున్నట్లు వివరించారు. మ్యాచ్‌ ముగిశాక టికెట్ల విక్రయంపై సమగ్ర విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని