logo

బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రావు

బీసీ ఉపాధ్యాయ సంఘం(బీసీటీయూ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాస్‌రావు ఎన్నికయ్యారు. ఆదివారం బొగ్గులకుంటలోని బీసీ సాధికారత భవన్‌లో జరిగిన బీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

Published : 26 Sep 2022 02:40 IST

బీసీటీయూ నూతన కార్యవర్గంతో బీసీ సంక్షేమ సంఘం

జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌రావు తదితరులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: బీసీ ఉపాధ్యాయ సంఘం(బీసీటీయూ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాస్‌రావు ఎన్నికయ్యారు. ఆదివారం బొగ్గులకుంటలోని బీసీ సాధికారత భవన్‌లో జరిగిన బీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన సుంకర శ్రీనివాస్‌రావుతో పాటు ప్రధానకార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందన పసుపులేటి నరేంద్రస్వామి, ముఖ్యసలహాదారులుగా తాళ్లపల్లి సురేష్‌ను ఎన్నుకున్నారు. సంఘం నేతలు చక్రహరి రామరాజు, కుల్కచర్ల శ్రీనివాస్‌, నామని రాజేశ్‌, సాయితేజ, రాజుగౌడ్‌తో పాటు ఆయా జిల్లాల బీసీటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని