logo

పీఎఫ్‌ఐ సంస్థను నిషేధించాలి: వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌

దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) ఇస్లామిక్‌ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిషేధించాలని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), భజరంగ్‌దళ్‌

Published : 26 Sep 2022 02:40 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) ఇస్లామిక్‌ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిషేధించాలని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), భజరంగ్‌దళ్‌ డిమాండ్‌ చేశాయి. ఆదివారం కోఠిలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో పరిషత్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, పండరీనాథ్‌, బజరంగ్‌దల్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు, దుర్గావాహిని ప్రాంత ప్రముఖ్‌ వాణి సక్కూబాయి తదితరులు మాట్లాడారు. పీఎఫ్‌ఐ సంస్థ కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బయటపెట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. గతంలో నిషేధించిన సిమీ సంస్థ నుంచి పుట్టిందే పీఎఫ్‌ఐ అని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని