Hyderabad News: లేపేస్తామంటూ బెదిరిస్తే.. చంపేశారు!
భర్త వేధింపులు భరించలేని భార్య.. మేనమామతో చెప్పి లేపేస్తానంటూ చేసిన బెదిరింపు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. మహారాష్ట్రలో హత్యాయత్నం కేసులో పారిపోయి
ఈనాడు, హైదరాబాద్ న్యూస్టుడే, చార్మినార్: భర్త వేధింపులు భరించలేని భార్య.. మేనమామతో చెప్పి లేపేస్తానంటూ చేసిన బెదిరింపు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. మహారాష్ట్రలో హత్యాయత్నం కేసులో పారిపోయి నగరంలో తలదాచుకుంటున్న నిందితుడూ పోలీసులకు చిక్కాడు. సోమవారం బహదూర్పుర ఠాణాలో చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి, బహదూర్పుర ఇన్స్పెక్టర్ సుధాకర్తో కలసి దక్షిణ మండల డీసీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.
పహడీషరీఫ్ నివాసి మహ్మద్ జుబేర్(38)పై రాజేంద్రనగర్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. కొద్దిమంది యువకులను చేరదీసి ముఠా తయారు చేశాడు. 2014లో జరీనాబేగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలున్నాయి. జరీనాబేగం మేనమామ మహ్మద్ బాబూఖాన్(38), జుబేర్ మధ్య వ్యాపార లావాదేవీల్లో గొడవలున్నాయి. వీరిద్దరూ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా కొనసాగుతున్నారు. గతంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇద్దరి అనుచరులు హత్యకు గురయ్యారు. భర్త వేధింపులు భరించలేని జరీనాబేగం పుట్టింటికి చేరింది. భర్త ఫోన్చేసి వేధించటంతో తన మేనమామతో చెప్పి లోకంలో లేకుండా చేస్తానంటూ బెదిరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న జుబేర్ ఈనెల 14న హస్సన్నగర్ సలీమా హోటల్ వద్ద ఉన్న బాబూఖాన్పై తన అనుచరులతో కలసి కత్తులు, ఇనుప పైపులతో దాడి చేసి హతమార్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బహదూర్పుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తలదాచుకునేందుకు వచ్చి చిక్కాడు..
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్ రాజు తడాస్(24) ఈ కేసులో రెండో నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్లో అక్కడ ఓ వ్యక్తిపై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరాడు. తనకున్న పరిచయాలతో జుబేర్ ముఠాలో చేరాడు. బాబుఖాన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా రాహుల్రాజు నేరచరిత్ర వెలుగుచూసింది. ఈ కేసులో మహ్మద్ జుబేర్(38), రాహుల్రాజు తడార్(24), మహ్మద్ ఓమర్ఖాన్(35), మహ్మద్ ఉస్మాన్(34), మహ్మద్ ఖదీర్(38), మహ్మద్ ఇమ్రాన్(36)లను అరెస్ట్ చేశారు. 4 కత్తులు, 2 దేశవాళీ పిస్తోళ్లు, 6 బుల్లెట్లు, ఆటో, ద్విచక్రవాహనం, 6 మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప