Hyderabad Metro: అర్ధరాత్రి.. 24 కిలోమీటర్లు.. 31 నిమిషాలు..
గ్రీన్ఛానెల్ ద్వారా గుండెను తరలించిన హైదరాబాద్ మెట్రో మరో ప్రాణానికి అండగా నిలబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి 31 కిలోమీటర్లలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి 24 నిమిషాల వ్యవధిలో సోమవారం గుండెను తరలించిన వైద్యులు
మెట్రో రైలులో గుండె తరలింపు
ఈనాడు, హైదరాబాద్, ఫిలింనగర్, న్యూస్టుడే: గ్రీన్ఛానెల్ ద్వారా గుండెను తరలించిన హైదరాబాద్ మెట్రో మరో ప్రాణానికి అండగా నిలబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి 24 కిలోమీటర్లలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి 31 నిమిషాల వ్యవధిలో సోమవారం గుండెను తరలించిన వైద్యులు ఓ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. గుండె మార్పిడి చేసిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
నల్గొండ జిల్లా మటంపల్లికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అతని గుండెను సేకరించి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న రోగికి అమర్చేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని మెట్రో రైల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. కామినేని ఆసుపత్రి వైద్యులు, ఇతర మెడికోలు అర్ధరాత్రి ఒంటిగంటకు నాగోల్లోని మెట్రో స్టేషన్కు గుండెను తీసుకొచ్చారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు స్టేషన్ వరకు రైలులో తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంబులెన్స్లో ఫిల్మ్నగర్లోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న 33 ఏళ్ల వ్యక్తికి హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, కార్డియోథోరాసిక్, ట్రాన్స్ప్లాంట్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ డా.ఎ.జి.కె.గోఖలే బృందం విజయవంతంగా గుండెను అమర్చింది.
గుండె తరలింపులో సహకరించినందుకు హైదరాబాద్ పోలీసులు, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన ఎల్అండ్టీ మెట్రో రైలు అధికారులకు డా.గోఖలే కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో లైన్ 3 సెక్యూరిటీ అధికారులు, మెట్రో అధికారులు ఎక్కడా అంతరాయం లేకుండా రైలు ప్రయాణించేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరిలోనూ ఇలాగే గ్రీన్ఛానల్ ద్వారా మెట్రోలో గుండెను తరలించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఎంఆర్ఎవల్ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మూడు నెలల క్రితం జీవన్దాన్లో గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారని, రక్తనమూనాలు సరిపోవడంతో గుండె మార్పిడి చేసినట్లు జీవన్దాన్ ఇన్ఛార్జి డా.స్వర్ణలత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్: రొనాల్డ్ రాస్
[ 16-04-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. -
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు: రేవంత్రెడ్డి
[ 16-04-2024]
గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
18న భారాస కీలక సమావేశం.. ముఖ్య నేతలందరికీ ఆహ్వానం
[ 16-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. -
హైదరాబాద్లో మధ్యాహ్నం సగం సిటీ బస్సులకు విశ్రాంతి
[ 16-04-2024]
ఎండ బాగా ఉంది.. ద్విచక్రవాహనంలో ఏం వెళ్తాం.. బస్సులో వెళ్దామని నగరవాసులు అనుకుంటే.. ఎండలో మండిపోవాల్సిందే. -
బహదూర్పురాలో యువకుడి హత్య!
[ 16-04-2024]
నగరంలోని బహదూర్పురా ఠాణా పరిధిలో హత్య జరిగింది. -
మందేసి మందిపైకి.. బ్రీత్అనలైజర్లో 550 రీడింగ్
[ 16-04-2024]
పూటుగా మద్యం తాగిన ఓ యువకుడు ఐటీ కారిడార్లో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. -
సైబర్ మోసం.. కట్టడికి యోధులు సిద్ధం
[ 16-04-2024]
నేటి ఆధునిక కాలంలో ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవడంతో చాలా మంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. -
అంచనాలకు అందవు.. వ్యూహాలు చిక్కవు
[ 16-04-2024]
రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా.. చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో జరిగే ప్రతీ ఎన్నికలోనూ విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. -
నిర్మాణ వ్యర్థాలా.. మేమే తీసుకెళ్తాం
[ 16-04-2024]
ఇంటి నిర్మాణం, మరమ్మతు, కూల్చివేత సందర్భంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను మేమే తీసుకెళ్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ వెబ్సైట్, ‘మైజీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. -
హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ కేంద్రాలు
[ 16-04-2024]
ఎన్నిక ఏదైనా.. తక్కువ మంది ఓటేసే జిల్లాల్లో రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ ‘ఈనాడు’కు తెలిపారు. -
కోడ్ కూశాక.. కూత మొదలు
[ 16-04-2024]
నగరానికి నాలుగో రైల్వేస్టేషన్గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
హామీలు ఇచ్చి.. ఆశీర్వదించమని కోరి
[ 16-04-2024]
రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా నారాయణపేటలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభ కొనసాగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివిధ వర్గాలకు పలు హామీలను గుప్పిస్తూ కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. -
మంటల కాలం.. ముందు చూపుంటేనే పైలం
[ 16-04-2024]
తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు పరిశ్రమలు, ఇటు వాణిజ్య కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ల్లో సంభవించిన ఘటనలు ప్రతి చోటా నిప్పు ముప్పు పొంచి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. -
నోరూరించే మామిడి.. మార్కెట్లో సందడి
[ 16-04-2024]
నోరూరించే మామిడి పండ్ల సీజన్ రానేవచ్చింది.. మార్కెట్లో మామిడి విక్రయాలు జోరు ఆరంభమైంది. నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో మామిడి క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. -
షార్ట్సర్క్యూట్తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
[ 16-04-2024]
షార్ట్సర్క్యూట్ వల్ల ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. పేట్బషీరాబాద్ సీఐ కె.విజయవర్ధన్ వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన కాంకేర్ ట్రావెల్స్ బస్సు ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్కు చేరింది. -
నీటి వృథా నివారణకు ముమ్మర తనిఖీలు
[ 16-04-2024]
‘పడిపోతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని పరిగి పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం, నీటి వృథాను అరికట్టడంలో భాగంగా తనిఖీలు విస్తృతం చేశామని’ పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. -
మధుయాస్కీ గౌడ్కు మాతృ వియోగం
[ 16-04-2024]
టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి అనసూయమ్మ(85) సోమవారం ఉదయం మరణించారు. -
రేషన్ బియ్యం కొని ఎఫ్సీఐకి తరలింపు
[ 16-04-2024]
500 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్కుమార్ తెలిపారు. -
తెలుసుకో.. ఓటు సద్వినియోగం చేసుకో
[ 16-04-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటింది. అలాంటి ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకుని వినియోగించుకోవాలి. అందుకోసం ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. -
ఏటీఎంలో రూ.19 లక్షల చోరీ
[ 16-04-2024]
శంషాబాద్లో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.19 లక్షలు ఎత్తుకెళ్లారు. శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి వివరాల ప్రకారం.. -
మహిళలపై హోంగార్డు దాడి
[ 16-04-2024]
ఓ హోంగార్డు రౌడీలా మారాడు.. కర్రలు, ముష్టిఘాతాలతో మహిళలు, బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఏడునెలల గర్భిణినీ వదలకుండా కాలితో తన్నాడు. -
అమెరికా ఆర్మీ అధికారినంటూ రూ.23 లక్షలు స్వాహా
[ 16-04-2024]
అమెరికా ఆర్మీలో మహిళా అధికారినంటూ నమ్మించి 80 ఏళ్ల విశ్రాంత శాస్త్రవేత్తనుంచి సైబర్ నేరగాళ్లు రూ.23.59 లక్షలు కాజేశారు. తనవద్ద ఉన్న డాలర్లను భద్రపరిస్తే కమీషన్ ఇస్తానని చెప్పిన ఆమె.. -
పొగచూరుతున్న ఉజ్వల
[ 16-04-2024]
ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల జారీ కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. రాజధాని పరిధిలో రెండేళ్లుగా ఈ పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో చాలామంది ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటున్నారు. -
పంట ఎండుతోందని ఎమ్మెల్యేకు రైతు మొర
[ 16-04-2024]
కందుకూరు మండలానికి వచ్చి తిరిగి వెళ్తున్న స్థానిక శాసన సభ్యురాలు సబితారెడ్డి కారును ఓ రైతు ఆపాడు.. పంట ఎండిపోతోంది.. కరెంటు లేక బోరు నీళ్లు రావట్లేదని కన్నీటిపర్యంతమయ్యాడు. -
నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర కృషి భేష్
[ 16-04-2024]
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని జెమినీ ఎడిబుల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. -
ఇండియా-ది రోడ్ టు రినైసెన్స్ పుస్తకావిష్కరణ
[ 16-04-2024]
ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి, విశ్రాంత ఐఏఎస్ భీమేశ్వర చల్లా (సీబీ రావు) రాసిన ‘ఇండియా-ది రోడ్ టు రినైసెన్స్: ఎ విజన్ అండ్ ఎజెండా’ పుస్తకావిష్కరణ సోమవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన
-
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
-
సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు!
-
ఆజాద్ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు
-
అవినాష్.. మీ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇవ్వండి: వైఎస్ సునీత
-
ఆ అలవాట్లతో.. స్పెర్మ్ డీఎన్ఏకు ముప్పు!