తెల్లకోటుకు నల్లమరక
నగర శివారు శంకర్పల్లిలోని రవితేజ పిల్లల ఆసుపత్రి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే. సరైన అర్హత లేని వారే వైద్యం చేస్తున్నారు. బయోవ్యర్థాలను సరిగా డిస్పోజ్ చేయడం లేదు. ఇదే
అర్హత లేకున్నా వైద్యం.. రోగుల ప్రాణాలతో చెలగాటం
వైద్యారోగ్య శాఖ తనిఖీల్లో వెలుగులోకి వాస్తవాలు
ఈనాడు, హైదరాబాద్
నగర శివారు శంకర్పల్లిలోని రవితేజ పిల్లల ఆసుపత్రి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే. సరైన అర్హత లేని వారే వైద్యం చేస్తున్నారు. బయోవ్యర్థాలను సరిగా డిస్పోజ్ చేయడం లేదు. ఇదే పట్టణంలోని ఇందిరా పిల్లల దవాఖానాదీ ఇదే ధోరణి. పారిశుద్ధ్యం సరిగా లేదు. వైద్యుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సైతం లేదని వైద్యారోగ్య శాఖ తనిఖీల్లో వెల్లడైంది.
షాద్నగర్లోని అమృత పిల్లల దవాఖానా. ఇక్కడ నిబంధనలు గాలికొదిలేశారు. రిజిస్టర్ వైద్యులు అందుబాటులో లేరు. ఏయే సేవలకు ఎంత ఛార్జి చేస్తున్నారనే విషయాలు ఎక్కడా ప్రదర్శించడం లేదు. ఇతరత్రా నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది.
అగ్నిమాపక శాఖ అనుమతులుండవు.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండదు.. రిజిస్టర్డ్ వైద్యులు ఉండరు.. అర్హత లేకపోయినా వైద్యం చేస్తుంటారు.. ఇలా ఒకటేమిటి ప్రైవేటు ఆసుపత్రులలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే..! కనీస ప్రమాణాలు పాటించకుండా పలు ఆసుపత్రులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ చేపట్టిన తనిఖీల్లో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, అనుమతులు లేవని తెలుతోంది. ఆయా ఆసుపత్రులకు ‘ఈనాడు’ పరిశీలనలో ధ్రువీకరణలు లేనట్లుగా తేలింది.
గడువు తీరినా..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో 4300 ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, డెంటల్ క్లినిక్లు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీన్ని కొందరు పట్టించుకోవడం లేదు. గడువు ముగిసినా రెన్యువల్ చేయించడం లేదు. దీనికితోడు షాద్నగర్లోని మహాబోధి డయాగ్నస్టిక్ కేంద్రంలో చికెన్గన్యా, డెంగీ టెస్టు కిట్లు, ఎలక్ట్రోలైట్ ప్యాకెట్లు గడువు తీరినా వినియోగిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నా.. ఆయా శాఖలు పట్టించుకోవడం లేదు. అంతిమంగా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. రెండున్నరేళ్ల కిందట ఎల్బీనగర్లోని షైన్ పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఓ పసికందు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత పదేళ్లలో నగరంలోని ఆసుపత్రులలో చోటుచేసుకున్న నాలుగు ప్రధాన అగ్ని ప్రమాదాలలో ఎనిమిది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
కొన్ని క్లినిక్లలో ఉల్లంఘనలు ఇలా..
* అర్హత ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉండటం లేదు
* బయోమెడికల్ సర్టిఫికెట్ లేదు
* అగ్నిమాపక శాఖ ఎన్వోసీ లేదు
* అగ్నిమాపరికరాలు అమర్చడం లేదు
* కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ లేదు
* బయోమెడికల్ వ్యర్థాల అధ్వానం
* ఆయుష్ వైద్యులతో అల్లోపతి వైద్యం చేస్తున్నారు.
నాణ్యత ప్రమాణాలపై ప్రధాన దృష్టి
పి.శ్రీనివాస్, మేడ్చల్ డీఎంహెచ్వో
ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై తనిఖీలు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా నాణ్యత ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలిస్తున్నాం. చిన్నలోపాలు ఉంటే సవరించుకునేందుకు సమయం ఇస్తాం. అప్పటికీ మారకపోతే సీజ్ చేస్తాం. అర్హత లేకుండా వైద్యం చేస్తుంటే ఆయా క్లినిక్లు మూసివేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు