రూ.కోట్లు కూడబెట్టాలని దోపిడీలు!
అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్మార్కెట్లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం
సొత్తు పరిశీలిస్తున్న అదనపు సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు
ఈనాడు, హైదరాబాద్: అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్మార్కెట్లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్బాగ్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ కె.శ్రీనాథ్రెడ్డి, ఎస్సార్నగర్ డీఐ రాంప్రసాద్తో కలిసి నగర అదనపు సీపీ (క్రైమ్, సిట్) ఏఆర్.శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు నివాసి కోనేటి జ్ఞానేశ్వర్ (26). 2019లో బీఎస్సీ మధ్యలో ఆపేసి కారు డ్రైవర్గా మారాడు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన నీలం శ్రీనివాస్ (33) ఖమ్మం జిల్లా జైలులో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్తో స్నేహం ఏర్పడింది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున దోపిడీ చేయాలనే పథకం వేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద జ్యోతిషుడు.. చెలపూరి పెద్దస్వామి పేరు ప్రఖ్యాతల గురించి శ్రీనివాస్ విన్నాడు. పెద్దస్వామి వద్ద డబ్బు ఉంటుందని భావించి జ్ఞానేశ్వర్తో కలిసి ఆశ్రమానికి వెళ్లారు. మే 3న అర్ధరాత్రి దాటాక ఇద్దరూ స్వామి గదిలోకి వెళ్లి టవల్లో గొంతు నులిమి చంపారు. సూర్యాపేట్లో ద్విచక్ర వాహనం చోరీ చేశారు. విజయవాడ చేరి 8 గొలుసు చోరీలు చేశారు. ఇటీవలే నగరానికి చేరిన జ్ఞానేశ్వర్, శ్రీనివాస్.. చోరీ చేసిన బైకుపై వెళ్తూ ఎస్సార్నగర్ పరిధిలో ఓ మహిళ మెడలో గొలుసు కొట్టేశారు. ఎస్సాఆర్ నగర్ పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..