logo

బకెట్‌లో మునిగి బాలిక దుర్మరణం

ప్రమాదవశాత్తు బకెట్‌ నీళ్లలో మునిగి బాలిక దుర్మరణం పాలైంది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం సీతామటిల్‌ జిల్లాకు చెందిన ఖాసిం

Published : 28 Sep 2022 02:38 IST

కాటేదాన్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు బకెట్‌ నీళ్లలో మునిగి బాలిక దుర్మరణం పాలైంది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం సీతామటిల్‌ జిల్లాకు చెందిన ఖాసిం మన్సూర్‌, ఖాతూన్‌ దంపతులు ఐదుగురు సంతానంతో నెలరోజుల రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పాతబస్తీ పరిధి అలీనగర్‌కు వలస వచ్చారు. మంగళవారం ఖాసిం హోటల్‌ పనికి వెళ్లగా.. భార్య పిల్లలను బయట ఉంచి వంట పనిచేసుకుంటోంది. నాలుగో కుమార్తె నజ్రీన్‌(16నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. దుస్తులు ఉతికేందుకు సగం వరకు నీళ్లున్న బకెట్‌లో ముఖంపెట్టి చూస్తూ ప్రమాదవశాత్తూ కాళ్లు పైకిలేచి ముఖ భాగం నీటిలో మునిగింది. తల్లి గుర్తించకపోవడంతో శ్వాస ఆడక మృతిచెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని