సంక్షిప్త వార్తలు
అంగట్లో సరకులా దొరుకుతున్న డేటా వెనుక గుట్టు కనిపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డబ్బు చెల్లిస్తే పేరు, ఫోన్ నంబరు, ఆధార్, పాన్, చిరునామా సహా కోరిన రూపంలో
డేటా చౌర్యంపై పోలీసుల నజర్
ఈనాడు, హైదరాబాద్: అంగట్లో సరకులా దొరుకుతున్న డేటా వెనుక గుట్టు కనిపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డబ్బు చెల్లిస్తే పేరు, ఫోన్ నంబరు, ఆధార్, పాన్, చిరునామా సహా కోరిన రూపంలో లక్షలాది మంది వ్యక్తిగత వివరాలను విక్రయిస్తున్న డేటా ప్రొవైడర్లను చట్టం ముందు నిలబెట్టనున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై త్వరలో ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు.
యూపీఎస్సీలో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి
గోల్నాక, న్యూస్టుడే: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ పటేల్గౌడ్ కోరారు. మెరిట్ వచ్చిన వారిని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలన్నారు. ఆదివారం చాదర్ఘాట్ మోతీమార్కెట్లోని కార్యాలయంలో మంగళవారం బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడారు. మెరిట్ వచ్చిన వారిని కూడా రిజర్వేషన్ కోటాలో భర్తీ చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నేతలు పులిజాల కృష్ణ, సాంబశివగౌడ్, దిలీప్ ఘనాతె, మాణిక్రావు పతంగె, ప్రశాంత్ నిమ్కర్, ప్రదీప్గౌడ్ పాల్గొన్నారు.
నిమజ్జన ప్రభావం.. ఆకుపచ్చగా సాగరం
ఈనాడు, హైదరాబాద్: సామూహిక గణేశ్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లో నీటిపై తీవ్ర ప్రభావం చూపించింది.. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు రెండు లక్షలు నిమజ్జనం కావడంతో ఆయా విగ్రహాల మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలు కలిసి సాగర్లో నీళ్లు ఆకుపచ్చగా మారిపోయాయి. నిమజ్జనం అనంతరం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు సంయుక్తంగా ఏడువేల టన్నుల వ్యర్థాలు తొలగించినా కాలుష్యం తగ్గలేదు సరి కదా.. మరింత పెరిగింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఏటా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు వివిధ దశల్లో ఆరు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు. ప్రాణవాయువు మరింత తగ్గిపోగా లోహాల సాంద్రత పెరిగింది.. బురద పేరుకు పోయిందని తేలింది.
భూవివాదంలో 8 మందికి గాయాలు
పహాడీషరీఫ్, న్యూస్టుడే: భూవివాదం ఘర్షణతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. పహాడిషరీఫ్ ఠాణా పరిధిలోని మామిడిపల్లి గ్రామం 324 సర్వే నంబరులోని 14 గుంటల స్థలంపై మాజీ గవర్నర్ శివశంకర్ కుమారుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్కుమార్కు గ్రామస్థుడు లాల్ సతీష్గౌడ్తో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. స్థలానికి వెళ్లే దారికి అడ్డంగా సతీష్గౌడ్ కంచె వేయిస్తుండగా.. వినయ్కుమార్, అతని కుమారుడు శాశ్వత్ అడ్డుకోవడంతో మంగళవారం ఘర్షణకు దారితీసింది. వినయ్కుమార్కు చెందిన 25 మంది బౌన్సర్లు, మరో ఇరవై మంది రౌడీలు తమపై దాడి చేశారని సతీష్గౌడ్ ఆరోపించారు. తమ స్థలం దారిలో కంచె వేస్తుండగా అడ్డుపడగా ఘర్షణ జరిగిందని వినయ్కుమార్ ఆరోపించారు. పోలీసులు రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. వారిలో రంగనాథ్, విజయ్కుమార్, భారతమ్మ, మహేందర్, అంజి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
పోలీసు వాహనాలకూ తప్పదు చలానా!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసు వాహనాలన్నీ డీజీపీ పేరుతోనే రిజిస్ట్రేషన్ అవుతాయని నగర ట్రాఫిక్ సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం(ఈనెల 27న) ‘డీజీపీ వాహనానికి రూ.7000 ఫైన్.. డబ్బులు కట్టరా’? అంటూ టీఎస్09 పీఏ 1234 కారు ఫొటోను ట్విట్టర్లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై నగర ట్రాఫిక్ సంయుక్త సీపీ స్పందించారు. 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వాహనాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై 11,601 కేసుల్లో, రూ.28,85,640 జరిమానా చెల్లించారన్నారు. ట్విట్టర్లో పేర్కొన్న సదరు వాహనంపై బకాయిలన్నీ సంబంధిత పోలీసు అధికారి చెల్లించారని తెలిపారు. ప్రభుత్వ/ప్రైవేటు వాహనాలనే బేధం లేకుండా నిబంధనలు పాటించని అన్నింటిపై జరిమానా/కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.
ముందే మ్యాచ్ ప్రారంభంపై హెచ్సీఏపై కేసు
బేగంపేట, న్యూస్టుడే: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 25న నిర్వహించిన మ్యాచ్ను పేర్కొన్న సమయం కంటే అరగంట ముందే ప్రారంభించి మోసం చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)పై బేగంపేట పోలీసులు కేసు నమోదుచేశారు. మ్యాచ్ టికెట్లపై మ్యాచ్ సాయంత్రం 7.30కు ప్రారంభమని ముద్రించారు. దీనిపై బేగంపేటకు చెందిన న్యాయవాది ఉప్పల అరుణ్కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
[ 29-03-2024]
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
[ 29-03-2024]
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
[ 29-03-2024]
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
[ 29-03-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
[ 29-03-2024]
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
[ 29-03-2024]
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. -
బల్దియా హస్తగతం!
[ 29-03-2024]
గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. -
భూ వినియోగ మార్పిడి దస్త్రాల్లో కదలిక
[ 29-03-2024]
ఎట్టకేలకు హెచ్ఎండీఏ పరిధిలోని భూ వినియోగ మార్పిడి(ల్యాండ్ యూజ్ కన్వర్షన్) దస్త్రాలకు మోక్షం లభించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
మూలికా వనం.. కబ్జాల పరం
[ 29-03-2024]
జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రారంభించిన మూలికా వనం(హెర్బల్ గార్డెన్)ను ఆక్రమించేందుకు కొందరు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వనంలో పదుల సంఖ్యలోనే మొక్కలుండగా, వాటి సంరక్షణనూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -
రూ.44.68 కోట్ల లోటుతో ఉస్మానియా వర్సిటీ బడ్జెట్
[ 29-03-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు జమా ఖర్చులను గురువారం ప్రకటించారు. -
వైద్యుల చొరవతో ఏడేళ్లకు కుటుంబ సభ్యుల చెంతకు
[ 29-03-2024]
మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాధితుడు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల చొరవతో ఏడేళ్ల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. -
సన్నని ధార...చాలని సరఫరా
[ 29-03-2024]
ఒకవైపు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. జలమండలి అరకొర నీటి సరఫరా...అందులో తక్కువ ఒత్తిడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
24 గంటలూ.. ట్యాంకర్లతో నీటి సరఫరా
[ 29-03-2024]
వచ్చేనెల మొదటి వారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా 24 గంటలపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. ఇందుకు అదనంగా 250 ట్యాంకర్లు, 24 ఫిల్లింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. -
నిబంధన ఎగ్గొట్టి.. రసాయనంతో మగ్గబెట్టి
[ 29-03-2024]
మధురఫలంగా పేరుగాంచిన మామిడి పండుపైన రసాయనక మరక పడుతోంది. ఇష్టానుసారం కార్బైడ్, ఇథలిన్ రసాయనాలు విచ్చలవిడిగా వినియోగించి మగ్గబెట్టేస్తున్నారు. ఇటీవల టాస్క్ఫోర్సు పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి రూ.12లక్షల విలువైన మామిడికాయలను పట్టుకున్నారు. -
పైసలు కాదు.. ప్రయాణమే ముఖ్యం
[ 29-03-2024]
ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా.. -
నిప్పు పొంచి ఉన్న ముప్పు
[ 29-03-2024]
భానుడి భగభగలకు నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గురువారం ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరుకుంది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మండే ఎండలకు తోడు తేమ శాతం తగ్గి అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. -
రూ.3 కోట్ల వజ్రం రూ.30లక్షలకే అంటూ మోసానికి యత్నం
[ 29-03-2024]
రూ.కోట్ల విలువైన వజ్రాన్ని రూ.లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. సౌత్వెస్ట్ డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. ముంబాయి, ఠాగూర్నగర్ విక్రిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తులేరే (48) మూడురోజుల క్రితం నగరానికి వచ్చాడు. -
బిస్కెట్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
[ 29-03-2024]
కాటేదాన్ పారిశ్రామికవాడలోని పహల్ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, పరిశ్రమ మేనేజర్ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. -
కార్ల గోదాంలో మంటలు.. ఆరు వాహనాలు దగ్ధం
[ 29-03-2024]
గండిపేట మండలం ఖానాపూర్ సమీపంలోని ఓ కార్ల గోదాంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మరమ్మతులకు గురైన వాహనాలు ఆహుతయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యాపారి మరమ్మతులకు గురయిన కార్లను ఖానాపూర్ సమీపంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచారు. -
చేయి లేకున్నా.. సైకిల్ యాత్ర
[ 29-03-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న సైక్లిస్టు తమిళనాడుకు చెందిన బి.తమీమ్ అన్సారీ. 2003లో తాను పనిచేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తూ కుడి చేతిని కోల్పోయారు. ఆ సమయంలో చికిత్సకు ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ప్రమాద బీమా వంటివి లేక ఆవస్థలు పడ్డారు. -
ప్రత్యర్థులు వారే... పార్టీలు వేరే
[ 29-03-2024]
ఐదేళ్ల కిందట లోక్సభ ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు భారాస అభ్యర్థిగా నామినేషన్ వేస్తే, మరొకరు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డారు. హోరాహోరీ పోరులో భారాస అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి 14వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
ఉప్పల్లో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
[ 29-03-2024]
40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా సీఎంఆర్ వస్త్ర దుకాణం నిలిచిందని సినీతార నిధి అగర్వాల్ కొనియాడారు. -
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. -
రంజాన్ జోష్.. అత్తర్లకు క్రేజ్
[ 29-03-2024]
రంజాన్ నేపథ్యంలో పాతనగరంలో అత్తర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో అనేక రకాల ఫ్లేవర్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. -
కొడంగల్ వృద్ధితోనే.. ఉపాధి అవకాశాలు సమృద్ధి: టీఆర్ఆర్
[ 29-03-2024]
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రభావం పరిగి, తాండూర్, పాలమూరు మీద పడి అవి కూడా పురోగమించి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి శాసన సభ్యులు రామ్మోహన్రెడ్డి అన్నారు. -
‘భారాస విజయానికి కృషి చేద్దాం’
[ 29-03-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయాలని చెప్పారు. -
మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా
[ 29-03-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్, కడ్మూరు, మేడిపల్లి కలాన్ గ్రామాల్లో పర్యటించారు. -
మహమ్మారిపై అప్రమత్తత అవసరం
[ 29-03-2024]
ప్రమాదకర ఎయిడ్స్పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్లైన్ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. -
ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం
[ 29-03-2024]
తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 29-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ