సంక్షిప్త వార్తలు
ప్రపంచ హృద్రోగ దినం పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వెల్నెస్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు....
ఏఐజీలో నేడు ఉచితంగా గుండె ఆరోగ్య పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ హృద్రోగ దినం పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వెల్నెస్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న వారికి అనుబంధ పరీక్షలతోపాటు కన్సల్టేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుందన్నారు.
ఫార్ములా-ఇ రేసింగ్ ట్రాక్ పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో నిర్వహించే ఫార్ములా-ఈ రేసింగ్కు సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ట్రాక్ను నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా రేస్ జరిగే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ప్లాజా తదితర ప్రాంతాలను మంగళ, బుధవారాల్లో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, వారు పరిశీలించారు.
సిబ్బంది లేకుండానే స్మార్ట్ బిల్లింగ్
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు బిల్లుల జారీలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. కార్యాలయం నుంచే బిల్లుల రీడింగ్ నమోదు చేసే స్మార్ట్ బిల్లింగ్ ప్రక్రియను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ మొదలెట్టింది. మొదటగా అధిక ఆదాయం వచ్చే హెచ్టీ కనెన్షన్ల నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని కనెన్షన్లలో చేపట్టారు. డిస్కం పరిధిలో కోటికిపైగా విద్యుత్తు కనెన్షన్లున్నాయి. గ్రేటర్లోనే 55 లక్షలకుపైగా ఉంటాయి. ప్రతినెలా సిబ్బంది ప్రతి కనెన్షన్ దగ్గరికి వెళ్లి మీటర్ రీడింగ్ నమోదు చేస్తున్నారు. హెచ్టీ కనెన్షన్ అయితే ఏకంగా ఏడీఈ స్థాయి అధికారి బిల్లింగ్ తీస్తున్నారు. డిస్కం పరిధిలో 70 కిలోవాట్లు ఆపై సామర్థ్యం ఉన్న హెచ్టీ (ఐటీ కార్యాలయాలు, పరిశ్రమలు, మాల్స్) కనెన్షన్లు 10 వేలుంటాయి. వీటి నుంచే 60 శాతం ఆదాయం వస్తుంది.
అప్రమత్తం చేసే ఏఎంటీ.. డిస్కం పరిధిలో 1500 హెచ్టీ కనెన్షన్లకు ఏఎంటీ మీటర్లున్నాయి. ఇందులో సిమ్ ఉంటుంది. మోడెమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం కార్యాలయానికి చేరుతుంది. ఏఎంటీ ఆటోమేషన్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగంలో హెచ్చుతగ్గులున్నా.. అసలు వినియోగమే లేకపోయినా ఇంజినీర్లను అప్రమత్తం చేస్తుంది.
నగరంలో 411 కొత్త బస్ షెల్టర్లు!
ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఏడాదిలో నగరంలోని 411 ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రవాణ విభాగం ఇంజినీర్లు ఇటీవల టెండర్లు పిలిచారు. కొత్త బస్టాపులకు ఆధునిక డిజైన్లు రూపొందించామని, ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించడమేగాక, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినట్లు జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఇచ్చే స్థలంలో.. బీఓటీ(బిల్ట్, ఓన్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో గుత్తేదారులు నిర్మాణాలు చేపడతారు. ఐదేళ్ల క్రితం అప్పటి కమిషనర్ నగరవ్యాప్తంగా 800లకుపైగా బస్షెల్టర్ల నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాజెక్టు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 411 బస్టాపులు నిర్మించాలని కొంతకాలం కిందట టీఎస్ఆర్టీసీ జీహెచ్ఎంసీని కోరింది. నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, టీఎస్ఆర్టీసీ ప్రతినిధులు సర్వే నిర్వహించి స్థలాలను ఎంపిక చేశారు. ఆయా స్థలాల్లో 5అడుగుల వెడల్పు, 5అడుగుల పొడవుతో బస్షెల్టర్లను నిర్మిస్తారు.
నలుగురు పీఎఫ్ఐ సభ్యులకు మూడు రోజుల కస్టడీ
చంచల్గూడ, న్యూస్టుడే: చంచల్గూడ జైల్లో ఉన్న నలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యులను 3 రోజుల కస్టడీ విచారణకు ఎన్ఐఎ అధికారులు తరలించారు. గుంటూరుకు చెందిన అబ్దుల్ రహీం(49), అబ్దుల్ వాహిద్(45), షేక్ జఫరుల్లాఖాన్(49), కర్నూల్కు చెందిన అబ్దుల్ వారిస్(61)ను ఎన్ఐఏ అధికారులు గతంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. వీరు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బుధవారం కోర్టు అనుమతులతో ఎన్ఐఏ అధికారులు వీరిని మరోసారి కస్టడీకి తీసుకెళ్లారు.
నగరంలో భారీగా పోలీసుల బదిలీలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ల వరకూ వివిధ కేటగిరీల్లో 247 మందిని బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు చేశారు. వీరిలో మూడేళ్ల పదవీ కాలం ముగిసి, శాంతిభద్రతలు, ట్రాఫిక్, డిటెక్టివ్ విభాగాల్లో పనిచేస్తున్న 45 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ తదితర విభాగాల్లో 5-7 ఏళ్లు ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూకబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం
[ 28-03-2024]
ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ టి. సుచరిత పేర్కొన్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 28-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
[ 28-03-2024]
మనవరాలిని చూసేందుకు నగరానికి వచ్చిన తాతయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ రాణా పరిధిలో జరిగింది. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
[ 28-03-2024]
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
[ 28-03-2024]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
[ 28-03-2024]
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!