logo

చిన్నారిపై అత్యాచారం.. దోషికి 20 ఏళ్ల జైలు

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మంచాలకు...

Updated : 29 Sep 2022 03:03 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన గుంట శ్రీనివాస్‌(50) ప్రైవేట్‌ ఉద్యోగి. 2015 డిసెంబరు 7న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి(5)కి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. మంచాల పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని రిమాండుకు తరలించారు. కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి బుధవారం తుది తీర్పునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని