నకిలీ కాల్సెంటర్ కేరాఫ్ కోల్కతా
నకిలీ కాల్ సెంటర్ ముఠాలు అడ్డా మారుస్తున్నాయి. ఇప్పటివరకూ బిహార్, ఝార్ఖండ్, దిల్లీ తదితర రాష్ట్రాలు కేంద్రంగా దందా కొనసాగిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ముఠాలను అరెస్టు చేస్తుండటంతో నేరగాళ్లు తమ మకాం కోల్కతాకు, అక్కడి పరిసర జిల్లాలకు మార్చారు.
ఈనాడు, హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ ముఠాలు అడ్డా మారుస్తున్నాయి. ఇప్పటివరకూ బిహార్, ఝార్ఖండ్, దిల్లీ తదితర రాష్ట్రాలు కేంద్రంగా దందా కొనసాగిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ముఠాలను అరెస్టు చేస్తుండటంతో నేరగాళ్లు తమ మకాం కోల్కతాకు, అక్కడి పరిసర జిల్లాలకు మార్చారు. ప్రధానంగా దక్షిణ కోల్కతాలోని జాదవ్పూర్, టోలిగంజ్ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో కాల్సెంటర్లు ఏర్పాటయ్యాయి. అక్కడి పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండడం, నకిలీ చిరునామాతో సిమ్కార్డులు సులువుగా దొరుకుతుండటంతో అడ్డా అక్కడికి మారినట్లు తెలుస్తోంది. డేటా ప్రొవైడర్ల ద్వారా లక్షల సంఖ్యలో ప్రజల వివరాలు సేకరిస్తున్న నేరగాళ్లు.. కోల్కతాలో సులువుగా సిమ్కార్డులు తీసుకుంటున్నారు. సిమ్కార్డులు ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్, సహా వ్యక్తి చిరునామా అవసరం లేకుండానే దొరకడంతో దర్యాప్తు సంస్థల్ని సులువుగా ఏమారుస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. నివాస ప్రాంతాల్లోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా వందల సంఖ్యలో కాల్సెంటర్లు కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చిన్న బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఒక బృందం పోలీసులకు పట్టుబడినా ఇతరులు గుర్తింపు మార్చుకుని మోసాలు కొనసాగిస్తున్నారు.
అనుమానం రాకుండా గుట్టుగా
కోల్కతా కేంద్రంగా తెలుగువారిని మోసం చేస్తున్న ముఠాలను ఇటీవల రాచకొండ, సైబర్బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం కోల్కతా వెళ్లినప్పుడు వారు కాల్ సెంటర్ నిర్వహిస్తున్న నివాసాన్ని చూసి దర్యాప్తు అధికారులు విస్తుపోయారు. రెండు పడక గదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారని, కింద కూర్చుని ఎవరికి వారు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారని ఓ అధికారి తెలిపారు.
విదేశీయులే లక్ష్యంగా మోసాలు
నకిలీ కాల్సెంటర్ల మోసాలు దేశీయంగా ఉండేవి. కోల్కతాలోని ముఠాలు ఇప్పుడు విదేశీయుల్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులోనూ వయసు మీరిన వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కోల్కతాలో ఓ ముఠాను అరెస్టు చేయగా ఈ ముఠా సభ్యులు కేవలం అమెరికన్లను మాత్రమే మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది. సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ అప్డేట్ అంటూ మెయిల్ పంపిస్తున్నారు. ఇది నమ్మి సంప్రదించిన అమెరికన్ల నుంచి సర్వీసు ఛార్జి వసూలు చేస్తారు. ఆ తర్వాత ఫోన్ ఆపేస్తారు. ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశీయుల్ని మోసం చేసిన కేసులు వెలుగుచూసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!