కాలు పెట్టాలన్నా కష్టమే
మెట్రోరైలులో ప్రయాణికుల సంఖ్య కొవిడ్ ముందు స్థాయికి చేరుకున్నా సరైన సౌకర్యాలు అందడం లేదు. స్టేషన్ పరిసరాల్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి మెట్రోలో కాలు పెట్టే వరకు నిత్యం పలువురు ప్రయాణికులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. కొన్ని స్టేషన్లలో ఇప్పటికీ మెట్ల మార్గాలు మూసే ఉంటున్నాయి.
రద్దీకి అనుగుణంగా లేని సర్వీసులు
స్టేషన్లలోనూ అస్తవ్యస్త పరిస్థితులు
అంతంతమాత్రంగా నిర్వహణ.. శ్రద్ధపెట్టని మెట్రోరైలు సంస్థలు
చిక్కడపల్లిలో మూసి ఉన్న ఒకవైపు మెట్ల మార్గం
ఈనాడు, హైదరాబాద్: మెట్రోరైలులో ప్రయాణికుల సంఖ్య కొవిడ్ ముందు స్థాయికి చేరుకున్నా సరైన సౌకర్యాలు అందడం లేదు. స్టేషన్ పరిసరాల్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి మెట్రోలో కాలు పెట్టే వరకు నిత్యం పలువురు ప్రయాణికులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. కొన్ని స్టేషన్లలో ఇప్పటికీ మెట్ల మార్గాలు మూసే ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల లిఫ్ట్లు, ఎస్కలేటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. లగేజీతో పెద్దలు నానా అగచాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిర్వహణ లోపాలే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. అయినా సరే వేగంగా గమ్యస్థానం చేరొచ్చు అని ఎక్కితే సాంకేతికత కారణాలతో మెట్రో ఆగిపోవడం, నిదానంగా నడవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో రైలు హైదరాబాద్ వాసులకి అందుబాటులోకి వచ్చి ఐదేళ్లు కావొస్తుంది. మెట్ల మార్గం నుంచి ఆపైన ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. స్టేషన్ కింద ఇరువైపులా 600 మీటర్ల దూరం వరకు పరిసరాలను హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ సుందరంగా అభివృద్ధి చేసింది. కొవిడ్ సమయంలో మెట్రో 169 రోజులు మూతపడటంతో నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. సర్వీసులు తిరిగి ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో సేవలు ప్రయాణికులకు అందడం లేదు. శుభ్రత తగ్గిందనే ఫిర్యాదులు వస్తున్నాయి. మెట్రోలో ప్రయాణం హాయ్ అనేది మూణ్నాళ్ల ముచ్చటగా మారింది.
ప్రయాణికులు లేరని..
కారిడార్-2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు పలు స్టేషన్లలో అన్ని మార్గాలను తెరవడం లేదు. చిక్కడపల్లి స్టేషన్లో ఒకవైపు మెట్లమార్గం ఎప్పుడు చూసినా మూసే ఉంటుంది. తెరవాలని ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రసూల్పురాలో ఇటీవల ఎస్కలేటర్ పనిచేయలేదు.
* స్టేషన్లలో మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. దుర్గంధంతో అధ్వానంగా ఉంటున్నాయి.
నగరంలో మెట్రో స్వరూపం
కారిడార్లు: 3
స్టేషన్లు: 57
అందుబాటులోకి వచ్చిన మార్గం: 69 కి.మీ.
దెబ్బతిన్న కాలిబాటలు
కాలిబాటల్లో చాలాచోట్ల టైల్స్ పగలిపోయాయి. ఎగుడు దిగుడుగా ప్రమాదకరంగా మారాయి. ఉప్పల్, నాగోల్లో కాలిబాటలు దెబ్బతిన్నాయి. నియంత్రణ లేక హబ్సిగూడ స్టేషన్ కాలిబాటల్లోనే వాహనాలను పార్క్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రవేశ మార్గాలకు అడ్డుగా నిలుపుతున్నారు.
* పచ్చదనంతో కళకళలాడాల్సిన స్టేషన్ కింద ఉన్న డివైడర్ కాస్త మట్టికుప్పలు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. రాయదుర్గం స్టేషన్తో సహా పలుచోట్ల ఇదే పరిస్థితి.
* చీకటి పడితే పలు స్టేషన్ల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మియాపూర్ స్టేషన్ పరిసరాలు, బేగంపేట పరిసరాల్లో పది గంటల తర్వాత మెట్రో దిగి బయటికి వచ్చే ప్రయాణికులు భయపడుతున్నారు. పోలీసుల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం..
స్టేషన్ పరిసరాల్లో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లాం. కాలిబాట ప్రాంతాల్లో మా సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా.. కవర్లలో చెత్తతీసుకొచ్చి వేస్తున్నారు. మెట్రోలో సౌకర్యాల మెరుగునకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం.
- ఎన్వీఎస్రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోరైలు
అడుగు పెట్టలేక..
ప్రస్తుతం మెట్రోలో రద్దీ బాగా పెరిగింది. నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీ ఉంటుంది. మరిన్ని సర్వీసులు పెంచాలని, మూడు నిమిషాలకు ఒకటి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. వారం క్రితం కారిడార్-1లో, కారిడార్-3లో సాంకేతికత సమస్యలతో 20 నిమిషాలు సేవలకు అంతరాయం కల్గింది.
పార్కింగ్ సమస్య..
హబ్సిగూడలో కాలిబాటలోనే వాహనాల పార్కింగ్
నగరంలో కొన్ని స్టేషన్లలో మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. మిగిలిన స్టేషన్లలో ఎక్కువగా రహదారులపైనే వాహనాలు నిలుపుతున్నారు. పెయిడ్ పార్కింగ్ కావడంతో దీన్నుంచి తప్పించుకునేందుకు ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!