రక్తహీనత.. అధిగమిస్తేనే భవిత!
జిల్లాలో మహిళలు, చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు మహిళా, శిశుసంక్షేమ జిల్లా అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా, ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఐరన్ లోపంతో
అధికారులు మరింత దృష్టి సారిస్తే మేలు
గర్భిణి బరువు చూస్తూ..
న్యూస్టుడే, వికారాబాద్: జిల్లాలో మహిళలు, చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు మహిళా, శిశుసంక్షేమ జిల్లా అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా, ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఐరన్ లోపంతో చాలా మంది గర్భిణులు, బాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. దీనివల్లే ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు కాన్పు సమయంలో 12 మంది మృతి చెందారని సమాచారం.
వికారాబాద్, మర్పల్లి, పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాజెక్టు పరిధిలో 1,106 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 8,701, బాలింతలు 6,209, 0-6 ఏళ్ల పిల్లలు 56,900 మంది నమోదయ్యారు. వీరికి ఆరోగ్యలక్ష్మి ద్వారా నిత్యం ఉదయం 200 మి.లీ పాలు, మధ్యాహ్నం గుడ్డుతో భోజనం వడ్డిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం పొట్లాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం ఇలా: జిల్లాలోని 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 8,701 మంది గర్భిణులు తమ పేర్లు నమోదు చేసుకుని, హెచ్బీ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,470 మందికి రక్తహీనత ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో 10-11 శాతం హెచ్బీకి వచ్చేలా ఏఎన్ఎంలు చూడాలి. వీరు ఐరన్ మాత్రలు ఇస్తున్నా, ఎంత వరకు వినియోగిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
భోజనానికి రూ.21 ఖర్చు..: ప్రభుత్వం ఒక్క పూట భోజనానికి రూ.21 వరకు ఖర్చు చేస్తోంది. జిల్లాలో 14,910 మంది కేంద్రాల్లో నమోదై ఉన్నారు. వీరిలో 9,600 మంది వరకు కేంద్రాల్లో భోజనం చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.3 లక్షలు వెచ్చిస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇటీవలే రాష్ట్రీయ బాల స్వాస్థ్య సురక్ష(ఆర్బీఎస్కే)లో 18 ఏళ్లలోపు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం మొదలైంది.
ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి
శాంతప్ప, చిన్న పిల్లల వైద్య నిపుణలు, ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్
పోషకాహారంలో లభించే ఇనుము ముఖ్యంగా మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తుంది. మెదడు పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి, కండరాల పనితీరుకు ఇనుము అవసరం. ఇది లేకుంటే రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. ముందునుంచే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!