మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మనస్తాపంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై షేక్షఫీ కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన మామిడి భరత్(22) పెయింటర్. తండ్రి సాంబయ్య చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ
కాప్రా, న్యూస్టుడే: మనస్తాపంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై షేక్షఫీ కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన మామిడి భరత్(22) పెయింటర్. తండ్రి సాంబయ్య చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోస్తున్నారు. బతుకుదెరువుకు నెల క్రితం తల్లి, చెల్లెలితో కలిసి నగరానికొచ్చారు. హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ఫేజ్-2 అద్దె ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం భరత్ గజ్వేల్లో పెయింటింగ్ పని ఉందని వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికొచ్చారు. ఏఎస్రావునగర్లోని ఓ క్యాంటీన్లో పని చేస్తున్న తల్లి, చెల్లెలు గురువారం సాయంత్రం ఇంటికొచ్చి చూడగా.. ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే యువకుడు ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నారు. ఇరువురికి వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా