ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నాలుగు ఈలు
నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాల వల్ల జటిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ పోలీసులు నాలుగు ‘ఈ’ల విధానాన్ని అవలంబించనున్నారు. రాకపోకలు సాఫీగా సాగేలా ‘ట్రాఫిక్ కార్యాచరణ ప్రణాళిక’ను సిద్ధం చేశారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కార్యాచరణ ప్రణాళిక
వివరాలు వెల్లడించిన నగర సీపీ సీవీ ఆనంద్
లోగోతో ఆనంద్, రంగనాథ్
ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాల వల్ల జటిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ పోలీసులు నాలుగు ‘ఈ’ల విధానాన్ని అవలంబించనున్నారు. రాకపోకలు సాఫీగా సాగేలా ‘ట్రాఫిక్ కార్యాచరణ ప్రణాళిక’ను సిద్ధం చేశారు.
వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్తో కలిసి నగర కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుత లోగో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించింది కావడంతో కొత్త లోగోను విడుదల చేశారు
ఈ-1 (ఆచరణ)
* కేవలం చలానాలపైనే దృష్టిపెట్టకుండా ట్రాఫిక్ క్రమశిక్షణ పెరిగేలా చూస్తాం.
* నిబంధనల అమలు, ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు చేపడతాం.
* వాహనదారులు సిగ్నళ్ల వద్ద జీబ్రాక్రాసింగ్లు దాటకుండా అవగాహన కల్పిస్తాం.
ఈ-2(ఇంజినీరింగ్)
* పెద్ద జంక్షన్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్రీ లెఫ్ట్లు పెడతాం.
* రద్దీ సమయాల్లో ‘రివర్సబుల్ లేన్’(ఎడమ వైపు నుంచి వెళ్లే వాహనాలకు కుడివైపు రోడ్డుపై కొంత దారివ్వడం) ఇస్తాం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నల్లకుంట, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో వన్వే ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం. యూటర్న్లను పెంచుతాం.
ఈ-3 (ఎడ్యుకేషన్)
* కొత్తగా సామాజిక మాధ్యమ విభాగాన్ని ఏర్పాటు చేసి యువతకు ట్రాఫిక్ నిబంధనలపై చిత్రాలతో అవగాహన కల్పిస్తాం.
ఈ-4(బలోపేతం)
* బాగా పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు సౌకర్యాలు పెంచుతాం. బదిలీల్లో భాగంగా 2005, 2010 బ్యాచ్ సీఐలకు పోస్టింగులిచ్చాం. కొత్తగా 40 మంది ఎస్సైలను నియమించాం.
* సిబ్బందిలేని 150 కూడళ్లలో 100 మంది హోంగార్డులను నియమిస్తాం. సాయుధ విభాగంలోని 100 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవల్ని వినియోగించుకుంటాం.
‘ఆపరేషన్ రోప్’
* ఆక్రమణలు, అడ్డగోలుగా నిలిపిన వాహనాల తొలగింపు దీని ప్రధాన లక్ష్యం. ఇందుకు ట్రాఫిక్ స్టేషన్కు రెండు చొప్పున క్రేన్లు కేటాయిస్తారు. నో పార్కింగ్లో నిలిపిన వాహనానికి క్లాంప్ పెట్టి దానిపై పోలీస్ అధికారి ఫోన్ నంబరు ప్రదర్శించడం.
* వ్యాపార సముదాయాల్లో పార్కింగ్ కల్పించేలా నిర్వాహకులకు అవగాహన.
* వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు రోడ్లపైకి రాకుండా సరిహద్దులు నిర్ణయించడం. ప్రజాప్రతినిధులతో కలిసి వీధి వ్యాపారులకు సమస్యను వివరించి సహకరించేలా చేయడం.
* ఆర్టీసీ అధికారులతో చర్చించి ఇబ్బందికర బస్టాపుల్ని మారుస్తాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక స్టాండ్ల కేటాయిస్తాం.
కారులో వెనుక కూర్చున్నా బెల్టు
కేంద్ర రవాణా శాఖ ఆదేశాల నేపథ్యంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న వారూ సీటు బెల్టు పెట్టుకోవాలనే నిబంధనను త్వరలో అమలు చేస్తాం.
క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక
అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగం అధికారులతో కమిషనర్ గురువారం సమావేశమయ్యారు. జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల వెంట సూచికల ఏర్పాటు, ఓఆర్ఆర్ వెంట ట్రామా కేంద్రాల నిర్మాణం, లింకు రోడ్ల దగ్గర ట్రాఫిక్ వాలంటీర్ల సేవల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. వర్షాల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే శాంతి భద్రతల విభాగం సహకారం తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు, ఏసీపీలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్