logo

Road Accident: గండిపేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. ప్రొఫెసర్‌ మృతి

రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ వద్ద శక్రవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ప్రొఫెసర్‌ నందన్‌కుమార్‌ (35) మృతి చెందారు. శంకర్‌పల్లి ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సన్‌సిటీ బండ్లగూడలో నివాసముంటున్నారు. ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 01 Oct 2022 00:23 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ వద్ద శక్రవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ప్రొఫెసర్‌ నందన్‌కుమార్‌ (35) మృతి చెందారు. శంకర్‌పల్లి ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సన్‌సిటీ బండ్లగూడలో నివాసముంటున్నారు. విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గండిపేట్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో ఆయన మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్‌ నందన్‌కుమార్‌ది ఒడిశా రాష్ట్రం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని