logo

ప్రమాదంలో ఐబీఎస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

కళాశాల నుంచి ఇంటికి వస్తున్న ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నార్సింగి ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి ఐబీఎస్‌ కళాశాలలో ఒడిశాకు చెందిన నందన్‌కుమార్‌(35) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా

Published : 01 Oct 2022 03:11 IST

నందన్‌కుమార్‌

నార్సింగి న్యూస్‌టుడే: కళాశాల నుంచి ఇంటికి వస్తున్న ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నార్సింగి ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి ఐబీఎస్‌ కళాశాలలో ఒడిశాకు చెందిన నందన్‌కుమార్‌(35) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బండ్లగూడ జాగీర్‌ సన్‌ సిటీలో నివాసం ఉంటున్నారు. కళాశాల నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గండిపేట సీబీఐటీ కళాశాల సిబ్బంది క్వార్టర్స్‌ వద్ద  వేగంగా దూసుకొచ్చిన జీపు ఢీకొట్టింది.  ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. జీపులో ఐబీఎస్‌ కళాశాల విద్యార్థులే ఉన్నట్లు తెలిసిందని ఎస్సై మురళి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని