logo

పాత కక్షలతోనే హత్య

పాత కక్షలు, వ్యాపార లావాదేవీలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో బాబాయి కుమారున్ని సోదరులు సెప్టెంబరు 27న అవుసులపల్లి శివారులో హత్య చేశారు. శుక్రవారం మెదక్‌ పట్టణంలో జిల్లా అదనపు ఎస్పీ

Published : 01 Oct 2022 03:11 IST

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: పాత కక్షలు, వ్యాపార లావాదేవీలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో బాబాయి కుమారున్ని సోదరులు సెప్టెంబరు 27న అవుసులపల్లి శివారులో హత్య చేశారు. శుక్రవారం మెదక్‌ పట్టణంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు వెల్లడించిన వివరాలు.. పట్టణ పరిధి అవుసులపల్లికి చెందిన తాడెపు సాయిలు మెకానిక్‌ వ్యాపారానికి ఇబ్బందులు సృష్టించడంతో బాబాయి కుమారుడైన శివాజీని హత్య చేయాలని పథకం వేశాడు. సెప్టెంబరు 27న రాత్రి సాయిలు, అతని తమ్ముడు లక్ష్మణ్‌, స్నేహితులు మల్లేశం, బన్ని ఓ వెంచర్‌లో శివాజీతో కలిసి మద్యం తాగారు. శివాజీ మద్యం మత్తులో ఉండగా నలుగురు కలిసి ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేసి హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి అవుసులపల్లి శివారులో పడేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో విచారణ చేపట్టారు. నలుగురికి అదుపులోకి తీసుకొచి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని