తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో స్నేహితుడి హత్య
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఫతేనగర్లో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని అమరావతికి
సనత్నగర్, న్యూస్టుడే: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఫతేనగర్లో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఎం.నీలేష్ మధుకరరావు రామ్టేకే(34), ఔరంగాబాద్కు చెందిన మహేష్(30)లు జీవనోపాధి నిమిత్తం నగరానికి చేరుకుని క్యాటరింగ్ పనులు చేసేవారు. ఫతేనగర్లోని ఒక గదిలో ఉండేవారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు మహేష్ నుంచి నీలేష్ రూ.16వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఈ కమ్రంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. మహేష్ పలుమార్లు డబ్బులు అడిగినప్పటికీ నీలేష్ ఇవ్వట్లేదు. డబ్బు చెల్లించకుంటే అంతు చూస్తానని నీలేష్ను మహేష్ హెచ్చరించాడు. ఈ క్రమంలో గురువారం నీలేష్తో పాటు ప్రస్తుతం అతనితో కలిసి గదిలో ఉంటున్న మనోజ్లు టీ తాగేందుకు బయటకు వచ్చారు. మహేష్, మిత్రుడు రావుసాహెబ్ వారికి ఎదురుపడ్డారు. తీసుకున్న అప్పు ఇవ్వమని మహేష్ మరోసారి వత్తిడి చేశాడు. నీలేష్ నిరాకరించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. పథకం ప్రకారం మహేష్.. తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడిచేశాడు. నీలేష్ కిందపడిపోయాడు. మహేష్, రావుసాహెబ్లు పారిపోయారు. నీలేష్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. నిందితులైన మహేష్, రావుసాహెబ్ను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!