logo

ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ కన్నుమూత

ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ అనారోగ్యంతో కన్ను మూశారు.

Published : 01 Oct 2022 08:32 IST

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ అనారోగ్యంతో కన్ను మూశారు. ఇటీవల గణపతి నవరాత్రుల సమయంలో అనారోగ్యం పాలైన ఆయన.. అస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నిమిజ్జనం రోజున కూడా ఆంబులెన్స్ లోనే శోభాయాత్రలో పాల్గొన్నారు. బాలగంగాధర్ తిలక్ నుంచి ప్రేరేపితమైన సుదర్శన్ తండ్రి శంకరయ్య.. ప్రతి ఏటా గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన తదనంతరం సుదర్శన్ ప్రతి ఏటా భారీ గణనాథులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా పేరున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని