దవాఖానాల్లో వణుకు
గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్బజార్, చార్మినార్: రాష్ట్రంలోని వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలు చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారుతున్నాయి.
వర్షానికి నీటి మడుగులుగా మారుతున్న ఆవరణలు
వేలాది మంది రోగులు-సహాయకులకు తీవ్ర ఇబ్బందులు
గాంధీ ఆసుపత్రి రోగుల వార్డు ఆవరణలో నిలిచిన మురుగునీరు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి- న్యూస్టుడే, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్బజార్, చార్మినార్: రాష్ట్రంలోని వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలు చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారుతున్నాయి. దీంతో వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.100 కోట్లు వ్యయం చేస్తే ముఖ్యమైన ఆస్పత్రుల్లో మురుగు-వర్షం నీటిని కిందికి తీసుకువెళ్లే వ్యవస్థలను మెరుగుపర్చవచ్చని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో పనులు సాగడం లేదు. ఇటీవల ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను, వివిధ రకాల యంత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా డ్రైనేజీ, నాలాల వ్యవస్థల మీద దృష్టిసారించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
గాంధీలో తీవ్ర ఇబ్బందే
గాంధీ ఆసుపత్రి సెల్లార్లో డ్రైనేజీ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. ప్రధాన భవన సముదాయంలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగులకు ఆహార పదార్థాలను వండే వంటశాల ఇక్కడే కొనసాగుతోంది. ఆసుపత్రి నిర్మించిన సమయంలో అప్పటి అవసరాల మేరకు వేసిన డ్రైనేజీ పైపులైనే ఇప్పటికీ ఉంది. ఈ పైపులైన్ సమీప కాలనీల నుంచి ప్రధాన నాలాలో కలిసేలా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ప్రక్షాళించేందుకు ఆసుపత్రి పరిపాలనా యంత్రాంగం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, దాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆమోదం తెలిపారు. నిధులు మంజూరుకాగానే ప్రక్షాళన పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
కోఠి ఈఎన్టీ వార్డుల్లోకి వరద..
కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి భూగర్భంలో ఉన్న నిజాంకాలం డ్రైనేజీ నాలా అవరోధంగా మారింది. పురాతన నాలా చెత్తాచెదారంతో నిండిపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి ఆసుపత్రి ఆవరణతోపాటు పలు వార్డుల్లోకి నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
* 460 పడకలున్న పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రి కూడా వర్షం పడితే చెరువుగా మారుతోంది. వర్షం పడితే డ్రైనేజీ, నాలాల వ్యవస్థ సక్రమంగా లేక పరిస్థితి అధ్వానంగా మారుతోందన్న విమర్శలున్నాయి.
వామ్మో ఉస్మానియా
ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బేగంబజార్ వాణిజ్య కేంద్రాల నుంచి ఉస్మానియా పాత భవనం, పాత మార్చురీ కింద నుంచి మూసీలోకి నిజాం కాలంలో నిర్మించిన పాత డ్రైనేజీ లైను ఉంది. దీని స్థానంలో పెరుగుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా రూ.50 లక్షల పైచిలుకుతో కొత్త డ్రైనేజీ పైపులైను నిర్మించాల్సిన అవసరం ఉందని రెండేళ్ల క్రితమే జలమండలి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పాత భవనం మూసివేయడంతో ఆ ప్రతిపాదన కాస్త మరుగునపడింది. వర్షం కురిసిన ప్రతిసారి పాత భవనం, పరిసర ప్రాంతాల్లో వరదనీరు చేరడం పరిపాటిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ