బస్సులు, రైళ్లు కిటకిట.. సీట్లకు కటకట
దసరా సమీపిస్తుండడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా భయం చాలా వరకు పోవడంతో రాజధాని నుంచి లక్షల సంఖ్యలో జనం అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఇటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నారు.
వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఉప్పల్ బస్టాండు
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: దసరా సమీపిస్తుండడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా భయం చాలా వరకు పోవడంతో రాజధాని నుంచి లక్షల సంఖ్యలో జనం అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఇటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నారు. సాధారణంగా ఏపీకి సంక్రాంతి పండగ సమయంలో లక్షల మంది వెళ్తుంటారు. దీనికి భిన్నంగా దసరాకు వారం ముందు నుంచి సొంతూరి బాట పట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న వారు తమ సొంత జిల్లాలకు భారీ ఎత్తున బయలుదేరుతున్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారం నాటికి ఏపీతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు రాజధాని నుంచి దాదాపు 10-15 లక్షల మంది వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులకే కాకుండా ప్రైవేటు బస్సులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా రూ.500 ఉన్న టిక్కెట్ను ప్రైవేటు బస్సుల యజమానులు రూ.1500 చేశారు. శనివారం ఎంజీబీఎస్ జనంతో కిక్కిరిపోయింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో సాయంత్రం నుంచి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉంటున్నారు. పఠాన్చెరు, మియాపూర్ తదితర ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత ఒక్కసారిగా వందల బస్సులు బయలుదేరుతున్నాయి. దీంతో కూకట్పల్లి నుంచి ఎల్బీనగర్ వరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా