logo

అప్పు చెల్లించడానికి దొంగయ్యాడు

కుటుంబ అవసరాల నిమిత్తం ఓ యువకుడు.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చేసిన అప్పు తిరిగి చెల్లించేందుకు దొంగతనాలు చేస్తున్న అతన్ని  సూర్యారావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Published : 02 Oct 2022 03:50 IST

బోరెల్లి శేఖర్‌

సూర్యారావుపేట: కుటుంబ అవసరాల నిమిత్తం ఓ యువకుడు.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చేసిన అప్పు తిరిగి చెల్లించేందుకు దొంగతనాలు చేస్తున్న అతన్ని  సూర్యారావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు.  పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బోరెల్లి శేఖర్‌ (34) బీటెక్‌ చేశాడు. భార్యతో గొడవ కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. పులివెందులలో చరవాణుల మరమ్మతుల దుకాణంలో పనిచేశాడు. 2016 నుంచి 2019 వరకు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో పని చేశాడు. హైదరాబాద్‌ నుంచి అమలాపురం వచ్చి నారాయణపేటలో అద్దెకు ఉన్నాడు. 2020లో ఓవ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. అది ఇప్పుడు రూ.4లక్షలు అయ్యింది. దీన్ని తీర్చేందుకు పలు చోరీలు చేశాడు. శనివారం గవర్నర్‌పేట ఎన్టీఆర్‌ కాంప్లెక్సు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని