సిబ్బంది లేక.. దస్త్రాలు పరిష్కరించక!
తాండూరు మండలం కరణ్కోటకు చెందిన పత్తుయాదవ్ గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. స్టంట్లు వేసేందుకు రూ.3 లక్షలవుతుందని, లేదంటే ఆరోగ్యశ్రీకార్డు సమర్పించాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి.
కార్యాలయాల్లో పేరుకుపోతున్న అర్జీలు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది
* తాండూరు మండలం కరణ్కోటకు చెందిన పత్తుయాదవ్ గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. స్టంట్లు వేసేందుకు రూ.3 లక్షలవుతుందని, లేదంటే ఆరోగ్యశ్రీకార్డు సమర్పించాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి. దీంతో కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీకార్డు వివరాలు పొందేందుకు తాండూరు తహసీల్దారు కార్యాలయానికి మూడు రోజులు తిరగాల్సి వచ్చింది.
* గోనూరు కాగ్నా నది నుంచి రాత్రివేళ జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వీఆర్ఓలను ఇతర శాఖలకు బదలాయించగా, గ్రామాల్లోని వీఆర్ఏలు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలు సాగకుండా, సహజ సంపద తరలిపోకుండా పర్యవేక్షించే వారు కరవయ్యారు.
జిల్లాలోని తహసీల్దారు కార్యాలయాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని వీఆర్ఓలను ఇతర శాఖల విధులు నిర్వహించేందుకు నియమించింది. జిల్లా వ్యాప్తంగా 199 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో రెవెన్యూ శాఖ యాభై శాతం ఖాళీ అయింది. గ్రామాల్లో విధులు నిర్వహించే వీఆర్ఏలు పేస్కేలు ప్రకారం జీతాలు చెల్లించాలని సమ్మె చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది కూడా లేకుండాపోయారు. ఈ ప్రభావం తహసీల్దారు కార్యాలయాలపై పడి, కార్యకలాపాలు నిదానంగా సాగుతున్నాయి.
వీఆర్ఏలను నియమిస్తే..
విద్యార్హతలున్న వీఆర్ఏలను తహసీల్దారు కార్యాలయాల్లో నియమిస్తే సిబ్బంది కొరత సమస్యను అధిగమించే వీలుంటుందనే రెవెన్యూ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వీఆర్ఓలను సర్దుబాటు చేయడంతో దస్త్రాల పరిశీలన, విచారణలో ఇబ్బందికరంగా మారిందంటున్నారు. డిగ్రీ, ఉన్నత చదువు పూర్తి చేసిన వీఆర్ఏలను నియమిస్తే ధ్రువపత్రాల పరిశీలన, గ్రామాల్లో విచారణ, ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు, కబ్జాలకు గురవకుండా నిఘా ఉంచేందుకు ఉపయోగపడనుంది. దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సేవలు అందించే ఆస్కారమేర్పడనుంది.
క్షేత్రస్థాయిలో పరిశీలించే వారేరి..
దళితబంధు దరఖాస్తుకు, విద్యార్థులు ఉపకార వేతనాలు, ప్రవేశాలు పొందేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. వీటికోసం లబ్ధిదారులు, యువత, విద్యార్థులు మీసేవా కేంద్రాల్లో అర్జీలు సమర్పిస్తున్నారు. వీఆర్ఓలు లేకపోవడం, వీఆర్ఏలు సమ్మెలో కొనసాగడంతో వీటిని క్షేత్రస్థాయిలో విచారించే వీల్లేకుండాపోయింది. దీంతో కార్యాలయాల్లోని పరిమిత ఉద్యోగులే అర్జీలను పరిశీలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తహసీల్దారు కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి. విచారించేందుకు గిర్దావర్ ఒక్కరే ఉండటంతో రోజుకు నాలుగైదు పరిష్కరించడం గగనమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.