చికిత్సలే ఉచితం..మందులు భారం
నగర ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు మాత్రమే ఉచితంగా అందుతున్నాయి. మందులు మాత్రం ప్రైవేటులో కొనాల్సి వస్తోంది. దీంతో రోగులపై ఆర్థిక భారం పడుతోంది. వైద్యుడు ఆరు రకాలు రాస్తే.. సగమే ఉచితంగా అందిస్తున్నారు. కొందరికి 10 రోజులకు మందులు రాస్తే.. 5 రోజులకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
సగం ఔషధాలు బయటే కొంటున్న రోగులు
ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి
నగర ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు మాత్రమే ఉచితంగా అందుతున్నాయి. మందులు మాత్రం ప్రైవేటులో కొనాల్సి వస్తోంది. దీంతో రోగులపై ఆర్థిక భారం పడుతోంది. వైద్యుడు ఆరు రకాలు రాస్తే.. సగమే ఉచితంగా అందిస్తున్నారు. కొందరికి 10 రోజులకు మందులు రాస్తే.. 5 రోజులకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మిగతా అయిదు రోజుల కోసం రోగులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని.. బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదంటూ అధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రోగులు వాపోతున్నారు. ఓపీకి రోగులకు వైద్యులు రాస్తున్న మందులు.. ఫార్మసీ వద్ద ఇస్తున్న వాటికి మధ్య పొంతన కుదరడం లేదు. ఈ అంశంపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా..పలువురు రోగులు తమ ఇబ్బందులను వెల్లడించారు.
ఎందుకిలా...: గాంధీ, ఉస్మానియాతోపాటు నిలోఫర్, ప్లేట్లబుర్జు, ఈఎన్టీ ఆసుపత్రులకు ఏటా రోగుల తాకిడి పెరుగుతోంది. కొవిడ్ తర్వాత 30 శాతం వరకు రోగుల తాకిడి పెరిగింది. పాత ఇండెంట్ ప్రకారమే వైద్య ఆరోగ్యశాఖ మందులు సరఫరా చేస్తోంది. ఉదాహరణకు 20 రకాల మందులకు ఇండెంట్ పెడితే అందులో 10-12 రకాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇటీవల కొన్ని రకాల మందుల సరఫరా పెంచినా సరే.. రోగుల తాకిడితో పోల్చితే అవి ఎటూ సరిపోవడం లేదని అంటున్నారు. కొన్ని రకాల బీపీ మందులు, దగ్గు, మధుమేహం, మల్టీ విటమిన్ మాత్రలు, నొప్పి నివారణ ఔషధాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేటు మందుల దుకాణాలను తొలగించి.. అన్ని మందులను తామే సరఫరా చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. వైద్యులు బయటకు మందులు రాస్తే...చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. తగినన్ని మందులు సరఫరా కాకపోవడం వల్లే.. బయటకు రాస్తున్నామని మరోవైపు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో రోగి కనీసం రూ.500 నుంచి రూ.3 వేల వరకు వెచ్చించి బయట కొంటున్నారు. డబ్బులు లేని వారు.. కౌంటర్లో ఇచ్చిన ఉచిత మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఒక్క గాంధీ ఆసుపత్రి పరిధిలోనే నెలకు తక్కువలో తక్కువ ప్రైవేటు దుకాణాల్లో రూ.3-5 కోట్లు వరకు మందులు విక్రయిస్తున్నారు.
డబ్బులు లేక కొనలేదు: రిచర్డ్, పాతబస్తీ
జ్వరంగా ఉంటే వచ్చి డాక్టర్కి చూపించాను. ఐదు రకాల మందులు రాశారు. గాంధీ పార్మసీ దగ్గర మూడు రకాలే ఇచ్చారు. మిగతావి బయట కొనుక్కుందామని వెళితే ఐదొందలు అవుతాయంటే డబ్బుల్లేక కొనలేదు.
బయట కొనుక్కోమంటున్నారు: లక్ష్మి, మల్కాజిగిరి
మా ఆయన్ని అనారోగ్యంతో ఉస్మానియాలో చేర్పించా..కొన్ని రకాల ఇంజక్షన్లు.. మాత్రలు బయట నుంచి తెచ్చుకోవాలని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. బయట కొనాలంటే రోజూ రూ.వేయి కంటే ఎక్కువే ఖర్చవుతోంది. డబ్బులు లేకే ఇక్కడకు వచ్చాం. అలాంటిది మందుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది.
3 రోజులకే ఇచ్చారు: సాయికృష్ణ, మంచిర్యాల
మా నాన్నకు ఒంట్లో బాగలేకపోతే ఉస్మానియా ఓపీలో చూపించాను. వైద్యులు ఆరు రోజులకు మందులు రాశారు. ఇవన్నీ పూర్తిగా వాడితేనే రోగం తగ్గుతుందని చెప్పారు. తీరా కౌంటర్ వద్దకు వెళ్తే మూడు రోజులకే ఇచ్చారు. అడిగితే అంతే ఉన్నాయని, మిగతావి బయట కొనుక్కోవాలని చెప్పారు. వేరే దారి లేక బయట కొన్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?