కొబ్బరిబొండాల మాటున గంజాయి
కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారిపై పట్టుబడింది.
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు
900 కిలోలు స్వాధీనం.. నలుగురి అరెస్టు
డీసీఎంలో బస్తాల మాటున గంజాయి
ఈనాడు- హైదరాబాద్: కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారిపై పట్టుబడింది. ఇంత పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం, ఆలేరు పోలీసుల సహకారంతో నలుగుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 900 కిలోల గంజాయి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న డీసీఎం, కొబ్బరిబోండాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
గతంలో నాలుగుసార్లు..
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన యోగేశ్ దత్తు గైక్వాడ్ ఈ ముఠా ప్రధాన సూత్రధారి. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెప్పించుకుని మహారాష్ట్రలో విక్రయించేందుకు తన మిత్రులు అహ్మద్నగర్ జిల్లాకు చెందిన పెయింటర్ వికాస్ బాబన్ సాల్వే(28), కూలీ పనులు చేసుకునే వినోద్ చంద్ర వంకాల్కర్(26), డ్రైవర్ కిషోర్ తులసీరామ్ వాడేకర్(24)ను సంప్రదించాడు. కమిషన్ ఆశ చూపి గంజాయి తరలించేందుకు ఒప్పించాడు. వీరికి మల్కన్గిరి జిల్లాకు చెందిన సరఫరాదారు పలాసి కర్రయ్యను(28) పరిచయం చేశాడు. అతడి నుంచి రూ.3వేల చొప్పున కిలో గంజాయి కొని మహారాష్ట్రలో రూ.20 వేలకు విక్రయించేవాడు. ఇలా నాలుగుసార్లు హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలించాడు. వీరు యోగేశ్ దత్తుకు లోడు అందించి తమ వంతు వాటా తీసుకుంటారు.
రావులపాలెంలో రూ.లక్ష వెచ్చించి
కొన్ని వారాల క్రితం యోగేశ్ దత్తు సూచన మేరకు వికాస్ బాబన్ సాల్వే, వినోద్ చంద్ర, తులసీరామ్ వాడేకర్ ముగ్గురు డీసీఎంతో తూగో జిల్లా రావులపాలెం దగ్గర రూ.లక్షకుపైనే వెచ్చించి కొబ్బరిబొండాలు నింపిన బస్తాలను కొని మల్కన్గిరి జిల్లా వెళ్లి పలాసికర్రయ్య దగ్గర గంజాయి కొన్నారు. దాన్ని బస్తాల్లో సర్ది కొబ్బరిబోండాల కింద వేశారు. వీరికి దారి చూపించేందుకు 19 ఏళ్ల చిట్టిబాబు వచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్.. ఆలేరు పోలీసుల సాయంతో వరంగల్- యాదాద్రి రహదారిపై మాటు వేసి నలుగుర్ని అరెస్టు చేశారు. యోగేశ్ దత్తు, పలాసి కర్రయ్య పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్