logo

కవులు సమాజానికి మార్గనిర్దేశం చేయాలి

కవులు సమాజానికి మార్గనిర్దేశం చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ కవుల సంఘం, బీసీ ఉపాధ్యాయుల సంఘం, కళాసూర్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Published : 04 Oct 2022 03:03 IST

మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

నల్లకుంట, న్యూస్‌టుడే: కవులు సమాజానికి మార్గనిర్దేశం చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ కవుల సంఘం, బీసీ ఉపాధ్యాయుల సంఘం, కళాసూర్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని సూచించారు. కవులు, రచయితలను సన్మానించారు. డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌, సుతారపు వెంకటనారాయణ, నాళేశ్వరం శంకరం, అనుముల ప్రభాకరచారి, మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని