logo

భార్య కాపురానికి రాలేదని మనస్తాపం.. భర్త ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరు ఠాణా ఎస్సై దుర్గయ్య తెలిపిన ప్రకారం.. పటాన్‌చెరు చైతన్యనగర్‌ కాలనీకి చెందిన రమేష్‌కు (38) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Published : 04 Oct 2022 03:03 IST

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరు ఠాణా ఎస్సై దుర్గయ్య తెలిపిన ప్రకారం.. పటాన్‌చెరు చైతన్యనగర్‌ కాలనీకి చెందిన రమేష్‌కు (38) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం భార్య.. రమేష్‌తో గొడవపడి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పెద్దలను పిలుచుకొని వెళ్లి కాపురానికి రమ్మని అడిగినా ఆమె ససేమిరా అంది. మనస్తాపానికి గురైన రమేష్‌ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు అతడిని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని