CM Kcr: జాతీయ పార్టీ సిద్ధం.. హైదరాబాద్ చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల నేతలు
గులాబి పార్టీలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతంర చెందబోతోంది. దసరా రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమేరకు ప్రకటన చేయనున్నారు.
హైదరాబాద్: గులాబి పార్టీలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతంర చెందబోతోంది. దసరా రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమేరకు ప్రకటన చేయనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సహా పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు పలకనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న తదితర జేడీఎస్ నేతలకు మంత్రి కేటీఆర్, తెరాస నేతలు స్వాగతం పలికారు.
తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న విడుదలై చిరుత్తయిగల్ కచ్చి (వీసీకే) పార్టీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్కు వచ్చిన వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్కు ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి స్వాగతం పలికారు. మరో 3 పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని తెరాస నేతలు చెబుతున్నారు. కొన్ని పార్టీలు భారాసలో విలీనమవుతాయని నాయకులు తెలిపారు. పార్టీ ప్రకటన తర్వాత మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్