logo

‘ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి’

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి పంకజ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఓటరు నమోదు నోటిఫికేషన్‌ ఈ నెల 1న విడుదలైందని..

Published : 05 Oct 2022 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి పంకజ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఓటరు నమోదు నోటిఫికేషన్‌ ఈ నెల 1న విడుదలైందని.. నవంబరు 7 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, నియోజకవర్గం పరిధిలో ఆరేళ్లపాటు నివాసం ఉండి, మూడేళ్లు ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వారు ఓటరు నమోదుకు అర్హులన్నారు. సర్వీసు ధ్రువపత్రం, గుర్తింపు కార్డు నకళ్లను జత చేసి దరఖాస్తును వారికి అందజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సీఈఓ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని