Fake Currency: యూట్యూబ్లో చూసి కరెన్సీ తయారీ: ఐదుగురి అరెస్టు
యూట్యూబ్లో చూసి నకిలీ కరెన్సీ తయారు చేయడం నేర్చుకున్న వ్యక్తులు వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలను మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్రెడ్డి, మైలార్దేవ్పల్లి సీఐ మధు విలేకరులకు వివరించారు.
నకిలీ కరెన్సీ చూపుతున్న ఏసీపీ గంగాధర్, పక్కన సీఐ మధు
రాజేంద్రనగర్, న్యూస్టుడే: యూట్యూబ్లో చూసి నకిలీ కరెన్సీ తయారు చేయడం నేర్చుకున్న వ్యక్తులు వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలను మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్రెడ్డి, మైలార్దేవ్పల్లి సీఐ మధు విలేకరులకు వివరించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, గౌరారానికి చెందిన బ్యాగరి అడమ్(38) వనస్థలిపురంలో ఉంటూ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితులు మరో ఇద్దరు డ్రైవర్లు బి.భరత్కుమార్(35), బి.శంకర్(42)లు కలిసి తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశారు. అడమ్ సూచన మేరకు ముగ్గురు కలిసి యూట్యూబ్లో నకిలీ కరెన్సీ తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు. ప్రింటర్ ద్వారా తేలికగా తయారు చేయొచ్చని భావించారు. వారికి సహకరించడానికి నల్లకుంటలో స్టేషనరీ దుకాణం నిర్వహించే ఎం.మాధవగౌడ్, వనస్థలిపురానికి చెందిన స్టాంపు పేపర్లు విక్రయించే వి.వీర వెంకటదుర్గ మణికంఠం నాయుడి సహకారం అడిగారు. అంతాకలిసి నకిలీ రూ.500, 200, 100 నోట్లను తయారు చేశారు. లక్ష రూపాయలు విలువచేసే కరెన్సీని మార్కెట్లో చలామణి చేయడానికి అడమ్, భరత్కుమార్, శంకర్లు కాటేదాన్కు వచ్చారు. నోట్లను మార్చేందకు ప్రయత్నిస్తుండగా మైలార్దేవ్పల్లి పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు. వారి నుంచి లక్ష రూపాయల నకిలి కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్