Nallala Odelu: తిరిగి సొంతగూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు తిరిగి సొంతగూటికి చేరారు. మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఓదెలు తెరాసలో చేరారు.

Updated : 05 Oct 2022 15:23 IST

హైదరాబాద్‌: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు తిరిగి సొంతగూటికి చేరారు. మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఓదెలు తెరాసలో చేరారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ భారాస ప్రకటనకు ముందుకు ఓదెలు దంపతులు ప్రగతిభవన్‌కు చేరుకుని తెరాసలో చేరారు.

ఓదెలు గతంలో తెరాస ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. భాగ్యలక్ష్మి సైతం తెరాస నుంచే జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన వారిద్దరూ.. ఈరోజు తిరిగి సొంతగూటికి చేరారు. తెరాసలో చేరికకు ముందు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని