logo

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేస్‌ 5లో పనిచేస్తున్న జోగి మధు(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 05 Oct 2022 15:08 IST

కాప్రా : చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేస్‌ 5లో పనిచేస్తున్న జోగి మధు(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని ఎస్వీనగర్‌కు చెందిన జోగి మధు చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్‌ 5లోని మైక్రో మీడియాలో ఎగ్జిక్యూటివ్‌ హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రేవతి, ఇద్దరు కవల పిల్లలున్నారు. మంగళవారం దసరా సందర్భంగా కంపెనీలో పూజలు నిర్వహించారు. అక్కడ వంట చేసిన వారికి డబ్బులు చెల్లించేందుకు ఆయన తన ద్విచక్ర వాహనంపై కంపెనీ నుంచి బయటకు వచ్చారు. కొంత దూరం వెళ్లగానే ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. గమనించిన మహిళా కార్మికులు ఆయన్ను ఈసీఐఎల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే ప్రమాద స్థలంలో పడి ఉన్న విధానం అనుమానాస్పదంగా ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని