logo

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.68.44 లక్షల విలువ చేసే 1.36 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 05 Oct 2022 19:04 IST

శంషాబాద్‌: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.68.44 లక్షల విలువ చేసే 1.36 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి 865.6 గ్రాములు, మరో ప్రయాణికురాలి నుంచి 435 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో చేసి లోదుస్తుల్లో దాచి అక్రమంగా తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మరో కేసులో రూ.6.90 లక్షలు విలువైన 69 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని