logo

కారు, బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో ఆమనగల్లు - షాద్‌నగర్‌ రహదారిపై బుధవారం రాత్రి కారు, బైక్‌ ఢీకొన్నాయి.

Published : 05 Oct 2022 22:16 IST

ఆమనగల్లు: కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో ఆమనగల్లు - షాద్‌నగర్‌ రహదారిపై బుధవారం రాత్రి కారు, బైక్‌ ఢీకొన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన కోల రామకృష్ణ సొంత బావ అయిన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందిన కడారి మల్లేశ్‌తో కలిసి కేశంపేట మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న రామకృష్ణ(26) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కడారి మల్లేశ్‌ (33) మార్గమధ్యంలో మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని