Cyber Crime: ఫోన్ పోయిందా.. డబ్బు గోవిందా
నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఫోన్ ఇటీవల చోరీకి గురైంది. మరుసటి రోజు కొత్త ఫోన్ తీసుకుని పాత నంబరుతో ఉండే సిమ్ వేసి చూశాక.. బ్యాంకు ఖాతాలోని దాదాపు రూ.25 వేలు మాయమయ్యాయి
యూపీఐ వాలెట్ల నుంచి నగదు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు
ఈనాడు, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఫోన్ ఇటీవల చోరీకి గురైంది. మరుసటి రోజు కొత్త ఫోన్ తీసుకుని పాత నంబరుతో ఉండే సిమ్ వేసి చూశాక.. బ్యాంకు ఖాతాలోని దాదాపు రూ.25 వేలు మాయమయ్యాయి. డబ్బు ఎలా పోయిందో తెలుసుకునేందుకు లావాదేవీలు చూడగా యూపీఐ వాలెట్ ద్వారా డబ్బు బదలాయించుకున్నట్లు తేలింది. ఖరీదైన స్మార్ట్ ఫోన్లు పొతే ఇలా కొత్త సమస్య వచ్చి పడినట్లే. గూగుల్పే, ఫోన్పే నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ రహస్య కోడ్ వంటివి ఫోన్లోని కాంటాక్టు లిస్టు, ఇతర రూపాల్లో భద్రపరచుకున్న వారే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కొట్టేసిన డబ్బుతో షాపింగులు
సాధారణంగా ఫోన్లు పోయి కొత్త ది కొని పాత నంబరు యాక్టివేషన్ చేయించేలోపు సైబర్ నేరస్థులు ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ పిన్ వంటివి కాంటాక్టు లిస్టులో సేవ్ చేసుకోవడంతో నేరగాళ్లకు పని మరింత సులువవుతోంది. మరికొందరు యూపీఐ కోడ్గా వరుస నంబరు, పుట్టిన సంవత్సరం, వాహన రిజిస్ట్రేషన్ నంబరు పెట్టుకుంటున్నారు. దీంతో సులువుగా ఛేదించి డబ్బు ఇతర ఖాతాలకు బదలాయించుకుంటున్నారు. కొందరు పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్లలో స్కాన్ చేస్తున్నారు. ఫోన్లు కొట్టేశాక సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులతోనూ డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొట్టేసిన ఫోన్ నంబరు ఏ బ్యాంకు ఖాతాతో లింక్ అయిందో తెలుసుకుని ఫోన్లో దాచుకున్న బ్యాంకు ఖాతా, యూజర్ ఐడీ సేకరించి తేలికగా డబ్బు కొట్టేస్తున్నారు.
బ్లాక్ చేయండిలా..
* గూగుల్పే వినియోగదారులు 18004190157 ద్వారా బ్లాక్ చేయాలి.
* ఫోన్పే వినియోగదారులు 08068727374 ద్వారా బ్లాక్ చేయాలి.
* పేటీఎం వినియోగదారులు 01204456456 ద్వారా బ్లాక్ చేయాలి.
అప్రమత్తంగా ఉండాలి
ఫోన్ పోయిన వెంటనే యూపీఐ, డబ్బు లావాదేవీలు నిర్వహించే యాప్ల నుంచి లాగ్అవుట్ అవ్వాలి. యూపీఐ, గూగుల్పే, ఫోన్పే పాస్వర్డ్ను కాంటాక్టు లిస్టులో సేవ్ చేసుకోకూడదు. ఒకవేళ యాప్ల నుంచి డబ్బు బదిలీ చేసుకున్నట్లు గుర్తిస్తే వీలైనంత తొందరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- శ్రీధర్, సైబరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట