చరిత ఆనవాళ్లు.. చెరిపేస్తున్నాయి తవ్వకాలు
మనదైన చరిత్రను భావితరాలకు అందించాలి. జిల్లాలో ఈ విషయంలో పురావస్తు శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
కనుమరుగవుతున్న సోమనాథ్గుట్ట
ఈనాడు, వికారాబాద్
మిగిలింది ఇలా..
మనదైన చరిత్రను భావితరాలకు అందించాలి. జిల్లాలో ఈ విషయంలో పురావస్తు శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. క్రీస్తుశకం 5, 11వ శతాబ్దాల కాలంలో జీవించి ఉన్న వారికి సంబంధించిన చరిత్ర, ఆ విశేషాలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి. మోమిన్పేట మండలం వెలిచాల్ శివారులో ఇటీవల బయటపడిన వీరగల్లు (వీరుడి) విగ్రహమే ఇందుకు సాక్ష్యం.
ప్రాధాన్యం విస్మరించి.. అధికారికం అంటూ..
సోమనాథుని గుట్టపై అయిదేళ్లుగా ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) కోసం తవ్వకాలు సాగుతున్నాయి. ఇదంతా అధికారికమే. గుట్టకున్న ప్రాధాన్యం, చరిత్రను విస్మరించి అధికారులు అనుమతులిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గుట్టపై ఇటీవలే వీరగల్లు విగ్రహం దొరకడంతో తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు. ‘న్యూస్టుడే’ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఇప్పటికే ఈ గుట్టు సగం తవ్వేశారు. మిగిలిన కొంత భాగాన్ని తవ్వుతుండగా... వీరగల్లును చెక్కిన విగ్రహం దొరికింది. దీనిపై ఒకవైపు దేవతా విగ్రహం, ఇద్దరు సేవకుల బొమ్మలు, రెండు వేటకుక్కల చిత్రాలున్నాయి.
పురాతన గుహ..
* ఇది 10-11శతాబ్దాల మధ్యకాలంలోని చెక్కి ఉండొచ్చని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఆ ప్రాంతానికి రక్షించే వీరుడు చనిపోయిన తర్వాత అతడి జ్ఞాపకంగా అప్పట్లో ఇలా వీరగల్లులను రాళ్లపై చెక్కేవారు. ఇది దొరకడంతో తవ్వకం ఆగింది. లేకుంటే మిగిలిన కొంత మట్టి దిబ్బపై క్రీస్తుశకం 5వ శతాబ్దం లోపు తొలిచిన ఒక గుహ కూడా కాలగర్భంలో కలిసిపోయేదే. ఈ గుహను అప్పట్లో మానవులు ఆవాసంగా ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.
ప్రత్యేక దృష్టిసారిస్తే...!
గుట్టలను ఆనుకొని ఉన్న పులిలొంక పక్కనే ఉన్న గుట్టపై లక్ష్మీనరసింహ ఆలయం ఉంది. దీనిని సుమారు 60ఏళ్ల క్రితం పరమయ్య అనే వ్యక్తి స్వయంగా కొండను తొలిచి కట్టారు. ప్రస్తుతం దీనికి సమీపంలోనూ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను వెలికితీసేలా ప్రత్యేక దృష్టిసారించి పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈలోగా తవ్వకాలు నిలిపివేశేలా గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరమయ్య కష్టపడి లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మించకుంటే ఈ గుట్ట మొత్తం ఇప్పటికే తవ్వకాల్లో నేలమట్టం అయ్యే ఉండేదని ఆయన మనవడు వెంకటేశం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్